మాదక ద్రవ్యాలను విద్యార్ధులకు అమ్మేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని లాసన్స్ బే కాలనీకి చెందిన సరిపల్లి వర్మరాజు... బీచ్ రోడ్డులో.. తెన్నేటి పార్కు వద్ద మాదక ద్రవ్యాల ప్యాకెట్లను విక్రయించేందుకు వేచిచూస్తుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అతని నుంచి 5 ఎల్ఎస్డి బ్లాట్ లు, 200 మిల్లీ గ్రాముల ఏడీఎంఎ కెప్టెన్ గోగొ ప్లస్ టిప్స్ ఓసీబీ షీట్లు, ఒక చరవాణి, హోండ్ యాక్టివా మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఏసీపీ మూర్తి తెలిపారు. 199.19 గ్రాముల గంజాయి, 8 చిన్న జిప్ లాక్ బ్యాగులను సీజ్ చేశామన్నారు.
ఇదీ చదవండి: