ETV Bharat / state

దుకాణదారులకు ఊరట.. నిబంధనలతో అనుమతులు - ఎమ్మెల్యే అమర్నాథ్​ తాజా వార్తలు

కరోనా సమయంలో నిర్వహిస్తున్న లాక్​డౌన్​లో భాగంగా విశాఖ జిల్లాలో కొన్ని దుకాణాలు మినహా మిగతావి తెరచుకోవచ్చని జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ మూర్తి తెలిపారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద వైకాపా నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈతరుణంలో దుకాణదారుల సమస్యలు కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లగా ఈ మేరకు సడలింపులను వెల్లడించారు.

lock down in anakapalli at visakhapatnam
వైకాపా నాయకులతో సమావేశం
author img

By

Published : May 14, 2020, 5:24 PM IST

అనకాపల్లిలో దుకాణాలు తెరిచే విషయాన్ని రెండు రోజుల క్రితం స్థానిక వ్యాపారులు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ దృష్టికి తీసుకొచ్చారని, ఆయన స్పందించి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కొన్ని దుకాణాలు మినహాయించి మిగతా వాటిని తెరచుకొనేలా అనుమతులు ఇచ్చారని వైకాపా పట్టణ అధ్యక్షులు మంద పాటి జానకి రామ రాజు తెలిపారు. అనకాపల్లిలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా రాకుండా అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపారని, రాబోయే రోజుల్లో నిబంధనలు పాటిస్తూ దుకాణాల్లో వ్యాపారాలు నిర్వహించాలని అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు సూచించారు.

అనకాపల్లిలో దుకాణాలు తెరిచే విషయాన్ని రెండు రోజుల క్రితం స్థానిక వ్యాపారులు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ దృష్టికి తీసుకొచ్చారని, ఆయన స్పందించి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కొన్ని దుకాణాలు మినహాయించి మిగతా వాటిని తెరచుకొనేలా అనుమతులు ఇచ్చారని వైకాపా పట్టణ అధ్యక్షులు మంద పాటి జానకి రామ రాజు తెలిపారు. అనకాపల్లిలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా రాకుండా అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపారని, రాబోయే రోజుల్లో నిబంధనలు పాటిస్తూ దుకాణాల్లో వ్యాపారాలు నిర్వహించాలని అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు సూచించారు.

ఇవీ చూడండి...

ఎల్జీ పాలిమర్స్​లో యాజమాన్య బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.