విశాఖ జిల్లా పాడేరులోని ఓ ఇంట్లో నాటుసారా ఉందన్న సమాచారంతో తనిఖీకి వెళ్లిన ఎక్సైజ్ కానిస్టేబుల్పై దాడి జరిగింది. పాడేరులోని బక్కల పనుకు వీధిలోని ఇళ్లలో నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారంతో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు తనిఖీలకు వెళ్లారు. ఇళ్లలో సోదాలు చేస్తుండగా నాటుసారా పోలీసుల కంటపడింది. వీడియోలు తీస్తుండగా స్థానికులు వారిపై దాడి చేశారు.
ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ తప్పించుకోగా, మరో కానిస్టేబుల్ను నిందితులు అటకాయించారు. తన వద్ద ఫోన్, పర్సు తీసుకున్నారని కానిస్టేబుల్ తెలిపారు. ఆయన పాడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దాడి చేసిన వారిని స్టేషన్కు తీసుకొచ్చి ప్రశ్నించారు. కానిస్టేబుల్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్