CM Chandrababu to Meet with Bankers: ఈ నెల 10 తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. 229వ, 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 17 తేదీన 228వ ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు సహా, పీ4 విధానం అమలు అంశాలపై ఎస్ఎల్బీసీ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్ధిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్ష చేయనున్నారు. 228వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ టేకెన్ రిపోర్టుపైనా ఎస్ఎల్బీసీలో చర్చించనున్నారు. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి లాంటి కేంద్ర పథకాలపైనా సమీక్ష చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్, డిజిటల్ జిల్లాల అంశంపైనా ఎస్ఎల్బీసీ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు హాజరు కానున్నారు.
'వికసిత ఏపీకి సహకరించండి' - నీతి అయోగ్ ఉపాధ్యక్షుడుని కోరిన సీఎం చంద్రబాబు
వేసవి వస్తోంది ఏం చేద్దాం? - రికార్డు స్థాయిలో గ్రిడ్ పీక్ డిమాండ్