విశాఖ జిల్లా గొలుగొండ మండలం గుండుపాల గ్రామానికి చెందిన గుమ్మడు లక్ష్మి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ప్రియుడు కట్నం కావాలని డిమాండ్ చేయడం వల్లే ఈ పని చేసిందని లక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా లక్ష్మి, గణేష్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అందుకు వారి పెద్దలు కూడా ఒప్పుకున్నారు. అయితే హఠాత్తుగా ప్రియుడు గణేష్ కట్నం కావాలని డిమాండ్ చేయడం వల్ల మనస్థాపానికి గురైన లక్ష్మి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా… మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఘటనపై లక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :