ETV Bharat / state

విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు ఐఎస్ఓ గుర్తింపు - విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రికు ఐఎస్ఓ గుర్తింపు

వైద్య అధికారులు, సిబ్బంది కృషి వల్లే ప్రభుత్వ మానసిక వైద్యశాలకు.. ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చిందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఐఎస్​ఓ 9001-2015 (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్)... సర్టిఫికేషన్ ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ISO certification
విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు ఐఎస్ఓ గుర్తింపు
author img

By

Published : Mar 16, 2021, 5:42 PM IST

సిబ్బంది, విద్యార్థులు, ఆచార్యులు, సహాయ ఆచార్యుల సమష్టి కృషి వల్లే ప్రభుత్వ మానసిక వైద్యశాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్​ వివరించారు. ఈ సర్టిఫికేషన్ ఇచ్చిన ఆలపాటి శివయ్యకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో మరిన్ని సదుపాయాలు కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రాణి కలెక్టర్​ని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆమెను సూచించారు.

కరోనా సమయంలో ఆసుపత్రిలోని పారిశుద్ధ్యం, సిబ్బంది సమన్వయం, అగ్నిమాపక చర్యలు, మందుల సరఫరా.. వంటి విషయాలను పరిశీలించానని ఐఎస్ఓ ఎండీ ఆలపాటి శివయ్య అన్నారు. ఈ సర్టిఫికేషన్ మానసిక ఆసుపత్రికి మూడు సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. రాధారాణి పాల్గొన్నారు.

సిబ్బంది, విద్యార్థులు, ఆచార్యులు, సహాయ ఆచార్యుల సమష్టి కృషి వల్లే ప్రభుత్వ మానసిక వైద్యశాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్​ వివరించారు. ఈ సర్టిఫికేషన్ ఇచ్చిన ఆలపాటి శివయ్యకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో మరిన్ని సదుపాయాలు కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రాణి కలెక్టర్​ని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆమెను సూచించారు.

కరోనా సమయంలో ఆసుపత్రిలోని పారిశుద్ధ్యం, సిబ్బంది సమన్వయం, అగ్నిమాపక చర్యలు, మందుల సరఫరా.. వంటి విషయాలను పరిశీలించానని ఐఎస్ఓ ఎండీ ఆలపాటి శివయ్య అన్నారు. ఈ సర్టిఫికేషన్ మానసిక ఆసుపత్రికి మూడు సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. రాధారాణి పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. ఏఎంఆర్​డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.