విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నుంచి ఖరీఫ్ వరినాట్లకు సాగునీటిని విడుదల చేయాలని వైకాపా నాయకులు కోరారు. శ్రేణులందరూ చీడికాడలో సమావేశమయ్యారు. సాగునీటి విడుదలపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు స్పందించాలని కోరారు. నాట్లకి వరి నారుమళ్లు సిద్ధంగా ఉన్నాయని, నీటి విడుదలపై జలవనరుల శాఖ అధికారులకు సూచించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి