ETV Bharat / state

చెక్ డ్యాంలో మునిగి ఇంటర్ విద్యార్థి మృతి

author img

By

Published : Nov 7, 2020, 7:08 AM IST

చెక్ డ్యామ్​లో ఈతకు దిగి... ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా మునగపాక మండలం మడకపాలెంలో జరిగింది.

inter student died in check dam
చెక్ డ్యాంలో ఇంటర్ విద్యార్థి మృతి


విశాఖ జిల్లా మునగపాక మండలం మడక పాలెంలో విషాదం చోటుచేసుకుంది. చెక్ డ్యామ్​లో ఈతకు దిగిన ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పెంటకోట నంద(17) రోజూ చెక్ డ్యాంలో ఈత కొట్టేవాడు. రోజూలాగే శుక్రవారం కూడా ​డ్యాంపై నుంచి నీటిలోకి దూకాడు. ఎంతకూ పైకి తేలక పోవడంతో స్థానికులు దిగి పరిశీలించారు. అప్పటికే నంద మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది.


విశాఖ జిల్లా మునగపాక మండలం మడక పాలెంలో విషాదం చోటుచేసుకుంది. చెక్ డ్యామ్​లో ఈతకు దిగిన ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పెంటకోట నంద(17) రోజూ చెక్ డ్యాంలో ఈత కొట్టేవాడు. రోజూలాగే శుక్రవారం కూడా ​డ్యాంపై నుంచి నీటిలోకి దూకాడు. ఎంతకూ పైకి తేలక పోవడంతో స్థానికులు దిగి పరిశీలించారు. అప్పటికే నంద మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది.

ఇదీ చదవండి:

సంచార లైబ్రరీలో ఆసక్తికరమైన పుస్తకాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.