ETV Bharat / state

'సైబర్ నేరాలపై అప్రమత్తత తప్పనిసరి' - news updates in vizag

సైబర్ నేరాల కేసుల్లో విశాఖపట్నం.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రెండేళ్లుగా సైబర్ మోసాలు పెరుగుతున్నాయంటూ... కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతీయసంస్థలు, విశ్వవిద్యాలయాలు, రక్షణసంస్థల కార్యకలాపాలకు కీలక స్థావరంగా నిలిచిన విశాఖ... ఇప్పుడు సైబర్ ఉచ్చులో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

in-cyber-crimes-vizag-get-all-india-second-rank
విశాఖ సైబర్ విభాగం
author img

By

Published : Oct 8, 2020, 11:52 PM IST

రెండేళ్లుగా విశాఖలో సైబర్ నేరాల కేసులు పెరుగుతున్నాయి. 2017లో 309 కేసులు నమోదు కాగా... 2018లో 427, 2019లో 400కు చేరుకుంది. జాతీయ స్థాయిలో 14 శాతానికి పైగా కేసులు విశాఖలోనే నమోదయ్యాయి. డిజిటల్ లావాదేవీల వినియోగం, సామాజిక మాధ్యమాల ప్రభావం, డిజిటల్ ఫార్మాట్లలో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచడం, నెట్ బ్యాంకింగ్​పై అవగాహన రాహిత్యం, సైబర్ మాయగాళ్ల వలలో పడటం వంటివి ఈ నేరాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి.

విశాఖ సైబర్ విభాగం

సైబర్ మోసాలు అంటే కేవలం ఆర్థికపరమైనవని భావించడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని అపహరించి, వాటితో ఆయావ్యక్తుల జీవితాల్లో అశాంతి కలిగించే ఎలాంటి సంఘటనైనా సైబర్ నేరాల కిందికే వస్తోందని చెబుతున్నారు.

నగరంలో సైబర్ నేరాల నమోదుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉండటంతో బాధితుల ఫిర్యాదుతో చాలావరకు కేసులను పోలీసులు ఛేదిస్తున్నారు. వేధింపులకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి.

ప్రభుత్వ సంస్థలూ.. ముందుకొస్తే సౌర వెలుగులు మీ సొంతం

రెండేళ్లుగా విశాఖలో సైబర్ నేరాల కేసులు పెరుగుతున్నాయి. 2017లో 309 కేసులు నమోదు కాగా... 2018లో 427, 2019లో 400కు చేరుకుంది. జాతీయ స్థాయిలో 14 శాతానికి పైగా కేసులు విశాఖలోనే నమోదయ్యాయి. డిజిటల్ లావాదేవీల వినియోగం, సామాజిక మాధ్యమాల ప్రభావం, డిజిటల్ ఫార్మాట్లలో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచడం, నెట్ బ్యాంకింగ్​పై అవగాహన రాహిత్యం, సైబర్ మాయగాళ్ల వలలో పడటం వంటివి ఈ నేరాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి.

విశాఖ సైబర్ విభాగం

సైబర్ మోసాలు అంటే కేవలం ఆర్థికపరమైనవని భావించడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని అపహరించి, వాటితో ఆయావ్యక్తుల జీవితాల్లో అశాంతి కలిగించే ఎలాంటి సంఘటనైనా సైబర్ నేరాల కిందికే వస్తోందని చెబుతున్నారు.

నగరంలో సైబర్ నేరాల నమోదుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉండటంతో బాధితుల ఫిర్యాదుతో చాలావరకు కేసులను పోలీసులు ఛేదిస్తున్నారు. వేధింపులకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి.

ప్రభుత్వ సంస్థలూ.. ముందుకొస్తే సౌర వెలుగులు మీ సొంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.