ETV Bharat / state

హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యదర్శి హర్షం - vizag doctors association talks on highcourt verdict

మత్తు వైద్యుడు సుధాకర్​ కేసులో హైకోర్టు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యదర్శి హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తాము రోడ్డెక్కడం సబబు కాదని..., అందుచేత ఎటువంటి ఆందోళనలు చేయలేదని ఆయన వివరించారు. వైద్యుని సస్పెండ్​కు గల కారణాలను లోతుగా పరిశీలించాలని కోరారు.

happy with the high court decision regarding doctor sudhakar case says doctors association state secretary
హెకోర్టు తీరుపై హర్షం వ్యక్తం చేసిన వైద్యుడు శ్యామ్​ సుందర్​
author img

By

Published : May 24, 2020, 12:28 PM IST

మత్తు వైద్య నిపుణుడు సుధాకర్​తో విశాఖలో పోలీసులు వ్యవహరించిన ఘటనపై విచారణను సీబీఐకు అప్పగించడాన్ని హర్షిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యదర్శి డా. పిడకల శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరగాలని తాము రోడ్డెక్కడం వలన ఈ కరోనా కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారనే ఉద్దేశంతో.. తాము ఎటువంటి చర్యలకు పాల్పడలేదని ఆయన తెలిపారు. ఘటన తర్వాత వైద్యులు సుధాకర్​తో తాను మాట్లాడానని, తిరిగి తన ఉద్యోగం తనకు ఇప్పిస్తే పేదలకు సేవ చేసుకుంటానని తెలిపారని డా.శ్యామ్ అన్నారు.

ఇదీ చదవండి :

మత్తు వైద్య నిపుణుడు సుధాకర్​తో విశాఖలో పోలీసులు వ్యవహరించిన ఘటనపై విచారణను సీబీఐకు అప్పగించడాన్ని హర్షిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యదర్శి డా. పిడకల శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరగాలని తాము రోడ్డెక్కడం వలన ఈ కరోనా కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారనే ఉద్దేశంతో.. తాము ఎటువంటి చర్యలకు పాల్పడలేదని ఆయన తెలిపారు. ఘటన తర్వాత వైద్యులు సుధాకర్​తో తాను మాట్లాడానని, తిరిగి తన ఉద్యోగం తనకు ఇప్పిస్తే పేదలకు సేవ చేసుకుంటానని తెలిపారని డా.శ్యామ్ అన్నారు.

ఇదీ చదవండి :

'నా బిడ్డ ఇంటికి తిరిగి రావాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.