ETV Bharat / state

అదనపు కట్నం... తీసింది ఉద్యోగిని ప్రాణం!

భర్త చదువుకుని సంపాదిస్తున్న వాడే అయినా.. డబ్బుపై వ్యామోహం. మరోవైపు అదనపు కట్నం తేవాల్సిందిగా.. అత్త ఈసడింపు. చివరకు ప్రభుత్వ ఉద్యోగిని ప్రాణాలు బలి తీసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

author img

By

Published : Nov 10, 2019, 5:10 PM IST

govt employee died with dowry harassment
వరకట్న వేధింపులకు ఉద్యోగిని బలి!

కాళ్లకు పారాణి అరలేదు. అప్పుడే వరకట్నానికి ఓ ప్రభుత్వ ఉద్యోగిని బలైంది. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక.. తనలో తానే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంది.

విశాఖ జిల్లా మునగపాక గ్రామానికి చెందిన పెంటకోట దివ్యకు అనకాపల్లికి చెందిన బుద్ధ చైతన్యతో 2019 మే 18న వివాహం జరిగింది. కట్నం కింద డబ్బు, బంగారం ముట్టజెప్పారు. దివ్య విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేసేది. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొన్ని రోజులుగా.. దివ్యను భర్త, అత్త వరకట్నం కోసం వేధిస్తున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తెను కొట్టి పుట్టింటికి పంపారని.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. సూసైడ్​ నోటును పోలీసులకు అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:రాయచోటిలో దారుణం... భర్త చేతిలో భార్య దారుణ హత్య

వరకట్న వేధింపులకు ఉద్యోగిని బలి!

కాళ్లకు పారాణి అరలేదు. అప్పుడే వరకట్నానికి ఓ ప్రభుత్వ ఉద్యోగిని బలైంది. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక.. తనలో తానే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంది.

విశాఖ జిల్లా మునగపాక గ్రామానికి చెందిన పెంటకోట దివ్యకు అనకాపల్లికి చెందిన బుద్ధ చైతన్యతో 2019 మే 18న వివాహం జరిగింది. కట్నం కింద డబ్బు, బంగారం ముట్టజెప్పారు. దివ్య విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేసేది. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొన్ని రోజులుగా.. దివ్యను భర్త, అత్త వరకట్నం కోసం వేధిస్తున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తెను కొట్టి పుట్టింటికి పంపారని.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. సూసైడ్​ నోటును పోలీసులకు అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:రాయచోటిలో దారుణం... భర్త చేతిలో భార్య దారుణ హత్య

Intro:Ap_vsp_46_varakatna_vedimpulanaku_udyogini_bali_AP10077_k.Bhanojirao_8008584722
వరకట్న వేధింపులకు ఉద్యోగిని బలైంది. విశాఖ జిల్లా మునగపాక లో దివ్య అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది పెళ్లైన ఆరు
నెలలకే కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు
విలపిస్తున్నారు





Body:మునగపాక గ్రామానికి చెందిన పెంటకోట దివ్య కి
అనకాపల్లికి చెందిన బుద్ధ చైతన్యతో
2019 మే 18 న వివాహం జరిగింది నివాసంలో కట్నం కింద నాలుగు లక్షల నగదు 12 తులాల బంగారం
లక్ష రూపాయలు విలువ చేసే సారి సామాన్లు
అందజేసినట్లు మృతురాలి తండ్రి
పెంటకోట సన్యాసిరావు తెలిపారు. దివ్య విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారి గా పనిచేస్తుంది. ఈమె భర్త చైతన్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు
గత కొద్దికాలంగా దివ్య ను ఈమె భర్త అత్త వరకట్నం కోసం వేధిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు తమ కుమార్తెను కొట్టి పుట్టింటికి పంపి చేసారని సూసైడ్ నోటు రాసిందని తెలిపారు దీన్ని పోలీసులకు అందజేశారు. తమ కుమార్తె మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు













Conclusion:ఎన్టీఆర్ ఆస్పత్రిలో వివాహిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు మునగపాక తహసిల్దార్ తారకేశ్వరి వివరాలు అడిగి తెలుసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి గ్రామీణ సి ఐ నరసింహారావు తెలిపారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.