ETV Bharat / state

కనుమ సందర్భంగా విశాఖ శారదాపీఠంలో గోపూజ

కనుమ పండుగను పురష్కరించుకొని విశాఖ శ్రీ శారదాపీఠంలో గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా ఆవులకు పండ్లు, అరిసెలు తినిపించారు.

author img

By

Published : Jan 15, 2021, 12:07 PM IST

Gopuja on the occasion of Kanuma in Saradapitam
విశాఖ శారదాపీఠంలో కనుమ సందర్భంగా గోపూజ

విశాఖ శ్రీ శారదాపీఠంలో కనుమ పండుగ వేడుకలు నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమన్ని జరిపారు.

గోమాతలకు హారతులిచ్చి స్వాములు స్వయంగా పండ్లు, అరిసెలు తినిపించారు. తెలుగు రాష్ట్రాలు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా గోమాతను ప్రార్ధించారు. ఏటా కనుమ పండుగ రోజున గోపూజ నిర్వహించడం విశాఖ శ్రీ శారదాపీఠం ఆనవాయితీ అని పండితులు తెలిపారు.

విశాఖ శ్రీ శారదాపీఠంలో కనుమ పండుగ వేడుకలు నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమన్ని జరిపారు.

గోమాతలకు హారతులిచ్చి స్వాములు స్వయంగా పండ్లు, అరిసెలు తినిపించారు. తెలుగు రాష్ట్రాలు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా గోమాతను ప్రార్ధించారు. ఏటా కనుమ పండుగ రోజున గోపూజ నిర్వహించడం విశాఖ శ్రీ శారదాపీఠం ఆనవాయితీ అని పండితులు తెలిపారు.

ఇవీ చూడండి...

అదరహో గుర్రపు పందేలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.