ETV Bharat / state

విశాఖ మన్యంలో ఉచిత బస్సు సర్వీసులు పునఃప్రారంభం

author img

By

Published : Sep 8, 2020, 1:08 AM IST

విశాఖ మన్యంలో కరోనా కారణంగా నిలిచిపోయిన ఉచిత బస్సు సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. జి.మాడుగుల నుంచి స్థానిక సీఐ సర్వీసులను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Free bus services start in manyam vishakhapatnam district
విశాఖ మన్యంలో ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం

విశాఖపట్నం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మద్దిగరువు, కుమడ, మూలగరువు ప్రాంతాలకు గత రెండేళ్లుగా ఉచిత బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. మన్యం మారుమూల గిరిజనులకు ఉపయోగపడే విధంగా పోలీస్ శాఖ ఈ సేవలు చేపట్టింది. అయితే కరోనా కారణంగా మార్చి నెల నుంచి ఈ బస్సు సర్వీసులు నిలిచి పోయాయి. తిరిగి సోమవారం ఉచిత బస్ సర్వీసులను అధికారులు ప్రారంభించారు.

జి.మాడుగుల నుంచి స్థానిక సీఐ దేవుడు బాబు ఉచిత బస్ సర్వీస్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజనులకు పోలీస్ శాఖ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

విశాఖపట్నం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మద్దిగరువు, కుమడ, మూలగరువు ప్రాంతాలకు గత రెండేళ్లుగా ఉచిత బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. మన్యం మారుమూల గిరిజనులకు ఉపయోగపడే విధంగా పోలీస్ శాఖ ఈ సేవలు చేపట్టింది. అయితే కరోనా కారణంగా మార్చి నెల నుంచి ఈ బస్సు సర్వీసులు నిలిచి పోయాయి. తిరిగి సోమవారం ఉచిత బస్ సర్వీసులను అధికారులు ప్రారంభించారు.

జి.మాడుగుల నుంచి స్థానిక సీఐ దేవుడు బాబు ఉచిత బస్ సర్వీస్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజనులకు పోలీస్ శాఖ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి:

పెరిగిన బంగారం, వెండి ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.