విశాఖజిల్లా పెందుర్తిలో విషనాగులు హల్చల్ చేశాయి. శారదా పీఠంలోకి , ప్రశాంతి నగర్ సబ్బవరం ఎండీవో ఆఫీస్ వద్దకు విషనాగులు వచ్చాయి. భయాందోళనకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
పాములన్నింటినీ చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రోజే ఇలా నాలుగు విష నాగులు రావటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'నాపై నమోదైన కేసును ఎత్తివేయండి'