ETV Bharat / state

తుపాను ధాటికి వేల ఎకరాల్లో పంట నష్టం... అన్నదాతలకు కష్టం - nivar affect in vishak latest news

నివర్​ తుపాను కారణంగా విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు... వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పంటపొలాలు చెరువులను తలిపిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతినటంతో... దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు పంటనష్టాన్ని అంచనా వేస్తున్నారు. పొలాల్లో వర్షపు నీరు బయటికి పోయేలా వ్యవసాయ అధికారులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు.

crop damage in vishakapatnam due to heavy rains with nivar cyclone affect
వర్షాలకు విశాఖలో వేల ఎకరాల్లో పంట నష్టం
author img

By

Published : Nov 27, 2020, 5:24 PM IST

నివర్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. చెరువులు, ఇతర జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో చాలాచోట్ల పంటపొలాలు నీటమునిగాయి. ఈదురు గాలులకు వరి నేలకొరిగిపోయి దెబ్బతింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం తదితర మండలాల్లో నేలకొరిగిన వరి పంటలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయ సిబ్బంది నీటి ముంపునకు గురైన పంట నష్టాన్ని వేస్తున్నారు. జిల్లాలో సుమారు 7,300 హెక్టార్లలో వరి పంట తడిసి పోయినట్టు అధికారులు గుర్తించారు. వర్షాలు తగ్గిన తర్వాత వాస్తవ పంటనష్టాన్ని అంచనా వేస్తామని విశాఖ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

పొలాల్లో నీరు బయటికి వెళ్లేందుకు సూచనలు

వరి పొలాల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లేలా వరి చేలలో పాయలు ఏర్పాటుచేయాలని మండల వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. వర్షం తగ్గిన తరవాత తడిసిన వరి పనలపై ఉప్పు ద్రావకాన్ని పిచికారి చేస్తే ధాన్యం రంగు మారకుండా ఉంటాయని తెలిపారు.

ఈనెల 26వ తేది సాయంత్రం వరకు జిల్లాలో వర్షపాతం వివరాలు

పెద గంట్యాడ మండలం 36 ఎంఎం
పరవాడ34.2 ఎంఎం
కసింకోట 31.8 ఎంఎం
సబ్బవరం 29.6 ఎంఎం
రాంబిల్లి28.6 ఎంఎం
గాజువాక28 ఎంఎం
నక్కపల్లి 26.6 ఎంఎం
అనకాపల్లి25.2 ఎంఎం
చోడవరం24.8 ఎంఎం
ఎలమంచిలి 22.8 ఎంఎం
బుచ్చయ్యపేట మండలం 19.8 ఎంఎం
పెందుర్తి 14.2 ఎంఎం
పాయకరావుపేట14.2 ఎంఎం
పద్మనాభం12 ఎంఎం
నర్సీపట్నం10.4 ఎంఎం
చింతపల్లి8.2 ఎంఎం
భీమిలి7.6 ఎంఎం
పాడేరు4.8 ఎంఎం
డుంబ్రిగుడ మండలం2 ఎంఎం


ఇదీ చదవండి:

పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను బీభత్సం..మునిగిన పంటలు

నివర్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. చెరువులు, ఇతర జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో చాలాచోట్ల పంటపొలాలు నీటమునిగాయి. ఈదురు గాలులకు వరి నేలకొరిగిపోయి దెబ్బతింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం తదితర మండలాల్లో నేలకొరిగిన వరి పంటలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయ సిబ్బంది నీటి ముంపునకు గురైన పంట నష్టాన్ని వేస్తున్నారు. జిల్లాలో సుమారు 7,300 హెక్టార్లలో వరి పంట తడిసి పోయినట్టు అధికారులు గుర్తించారు. వర్షాలు తగ్గిన తర్వాత వాస్తవ పంటనష్టాన్ని అంచనా వేస్తామని విశాఖ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

పొలాల్లో నీరు బయటికి వెళ్లేందుకు సూచనలు

వరి పొలాల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లేలా వరి చేలలో పాయలు ఏర్పాటుచేయాలని మండల వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. వర్షం తగ్గిన తరవాత తడిసిన వరి పనలపై ఉప్పు ద్రావకాన్ని పిచికారి చేస్తే ధాన్యం రంగు మారకుండా ఉంటాయని తెలిపారు.

ఈనెల 26వ తేది సాయంత్రం వరకు జిల్లాలో వర్షపాతం వివరాలు

పెద గంట్యాడ మండలం 36 ఎంఎం
పరవాడ34.2 ఎంఎం
కసింకోట 31.8 ఎంఎం
సబ్బవరం 29.6 ఎంఎం
రాంబిల్లి28.6 ఎంఎం
గాజువాక28 ఎంఎం
నక్కపల్లి 26.6 ఎంఎం
అనకాపల్లి25.2 ఎంఎం
చోడవరం24.8 ఎంఎం
ఎలమంచిలి 22.8 ఎంఎం
బుచ్చయ్యపేట మండలం 19.8 ఎంఎం
పెందుర్తి 14.2 ఎంఎం
పాయకరావుపేట14.2 ఎంఎం
పద్మనాభం12 ఎంఎం
నర్సీపట్నం10.4 ఎంఎం
చింతపల్లి8.2 ఎంఎం
భీమిలి7.6 ఎంఎం
పాడేరు4.8 ఎంఎం
డుంబ్రిగుడ మండలం2 ఎంఎం


ఇదీ చదవండి:

పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను బీభత్సం..మునిగిన పంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.