వైజాగ్ ప్రోపర్టీ ఎక్స్ పో(vizag property expo) కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు.. క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాసరావు(credai chairman srinivas rao) తెలిపారు. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో ప్రాపర్టీ ఎక్స్ పో కి సంబంధించిన బ్రోచర్ను క్రెడాయ్ సభ్యులు ఆవిష్కరించారు.
ఈ ఎక్స్ పో.. నాన్ ప్రాఫిటబుల్ షో అని, విశాఖ వాసులకు సరసమైన ధరలకు ఫ్లాట్ లు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన 6 ప్రోపర్టీ ఎక్స్ పో షోలకు.. విశాఖ వాసుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. డిసెంబర్ లో నిర్వహించనున్న 7న ప్రోపర్టీ ఎక్స్ పో షోను విజయవంతం చేయాలని కోరారు. డిసెంబర్ 24,25,26 తేదీల్లో జరిగే ఈ ప్రోపర్టీ ఎక్స్ పోలో.. వివిధ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చెందిన 120స్టాల్స్, హోం లోన్ ప్రొవైడర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
హోం లోన్ సెగ్మెంట్లో ఎస్బీఐ ముందుంటుందని.. బ్యాంకు డీజీఎం మాన్మయ్ పండబ్ తెలిపారు. క్వాలిటీ ఆఫ్ ప్రోజెక్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వమని స్పష్టం చేశారు . విశాఖలో చాలా ప్రోజెక్ట్లలో భాగస్వామ్యం అయ్యామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: