ETV Bharat / state

'హెచ్ పీసీఎల్ ప్రమాదంపై తక్షణమే విచారణ చేయాలి' - CPM concern over HPCL accident

హెచ్ పీసీఎల్ లోని క్రూడ్ డిస్టీలేషన్ యూనిట్ లో జరిగిన ప్రమాదంపై సీపీఎం విశాఖ నగర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.

CPM GVMC Corporator Gangarao
సీపీఎం జీవీఎంసీ కార్పొరేటర్ గంగారావు
author img

By

Published : May 26, 2021, 10:09 AM IST

హెచ్ పీసీఎల్ లోని క్రూడ్ డిస్టీలేషన్ యూనిట్ లో జరిగిన ప్రమాదంపై సీపీఎం విశాఖ నగర కమిటీ విచారం వ్యక్తం చేసింది. హెచ్ పీసీఎల్ లో క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ కెపాసిటీ పెంచటానికి మోడరైజేషన్ ప్రక్రియను ఎల్&టి సంస్థ చేస్తోందని.. ఈ పనులపై కూడా సమగ్ర తనిఖీ జరపాలని సీపీఎం జీవీఎంసీ కార్పొరేటర్ గంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు ప్రజలపై తీవ్ర విషకాలుష్యాన్ని కూడా వెదజల్లుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమల భద్రతా ప్రమాణాలు, పర్యావరణ సంస్థల అధికారాలన్నింటిని బలహీనం చేసిందని విమర్శించారు. తక్షణమే ఈ పారిశ్రామిక ప్రమాదాల నుంచి విశాఖ ప్రజలను కాపాడాలని అలాగే ఈ ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ కోరుతుందని తెలిపారు.

హెచ్ పీసీఎల్ లోని క్రూడ్ డిస్టీలేషన్ యూనిట్ లో జరిగిన ప్రమాదంపై సీపీఎం విశాఖ నగర కమిటీ విచారం వ్యక్తం చేసింది. హెచ్ పీసీఎల్ లో క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ కెపాసిటీ పెంచటానికి మోడరైజేషన్ ప్రక్రియను ఎల్&టి సంస్థ చేస్తోందని.. ఈ పనులపై కూడా సమగ్ర తనిఖీ జరపాలని సీపీఎం జీవీఎంసీ కార్పొరేటర్ గంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు ప్రజలపై తీవ్ర విషకాలుష్యాన్ని కూడా వెదజల్లుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమల భద్రతా ప్రమాణాలు, పర్యావరణ సంస్థల అధికారాలన్నింటిని బలహీనం చేసిందని విమర్శించారు. తక్షణమే ఈ పారిశ్రామిక ప్రమాదాల నుంచి విశాఖ ప్రజలను కాపాడాలని అలాగే ఈ ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ కోరుతుందని తెలిపారు.

ఇదీ చదవండీ.. 2 డోసులు తీసుకున్న 79% మందిలో యాంటీబాడీలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.