ETV Bharat / state

కరోనా మహమ్మారికి మద్యం మందా?: సీపీఎం - cpm protest against liquor sales in vishaka

కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ మద్యం దుకాణాలు తెరవడంపై సీపీఎం నేతలు మండిపడ్డారు. విశాఖలో నిరసనకు దిగారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందుతుందన్నారు.

cpm protest
cpm protest
author img

By

Published : May 4, 2020, 4:50 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మద్యం దుకాణాలను తెరిచే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను సీపీఎం ఖండించింది. విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టింది. 'తిండి కావాలి మద్యం వద్దు' అంటూ ప్లకార్డులు ధరించి సీపీఎం కార్యకర్తలు నినాదాలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం దుకాణాలను తెరిచిందని.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడుతున్నారని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం 25% మద్యం రేట్లు పెంచింది కాబట్టి.. మద్యం విక్రయాలు తగ్గుతాయన్న వాదనలో నిజం లేదని అన్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మద్యం దుకాణాలను తెరిచే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను సీపీఎం ఖండించింది. విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టింది. 'తిండి కావాలి మద్యం వద్దు' అంటూ ప్లకార్డులు ధరించి సీపీఎం కార్యకర్తలు నినాదాలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం దుకాణాలను తెరిచిందని.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడుతున్నారని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం 25% మద్యం రేట్లు పెంచింది కాబట్టి.. మద్యం విక్రయాలు తగ్గుతాయన్న వాదనలో నిజం లేదని అన్నారు.

ఇవీ చదవండి:

బీఎస్​ఎఫ్ ప్రధాన​ కార్యాలయంలో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.