ETV Bharat / state

ఎండ వేడిమి తట్టుకోలేక మృత్యువాత పడ్డ కోళ్లు

author img

By

Published : May 29, 2021, 11:37 AM IST

విశాఖ జిల్లాలో రెండు రోజులుగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుచ్చయ్యపేట మండలం మంగళాపురంలో.. ఎండ తీవ్రత తాళలేక ఫారంలోని కోళ్లు మరణించాయి.

died chickens
మరణించిన కోళ్లు

విశాఖ జిల్లాలో రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో నిన్న, నేడు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక మూగజీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుచ్చయ్యపేట మండలం మంగళాపురంలో.. ఎండ వేడిమి తట్టుకోలేక 600 కోళ్లు మరణించాయి. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల కోళ్లు మృత్యువాత పడి… ఆర్థికంగా నష్టపోయానని కోళ్ల ఫారం యజమాని వాపోతున్నాడు.

విశాఖ జిల్లాలో రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో నిన్న, నేడు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక మూగజీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుచ్చయ్యపేట మండలం మంగళాపురంలో.. ఎండ వేడిమి తట్టుకోలేక 600 కోళ్లు మరణించాయి. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల కోళ్లు మృత్యువాత పడి… ఆర్థికంగా నష్టపోయానని కోళ్ల ఫారం యజమాని వాపోతున్నాడు.

ఇదీ చదవండి: కాకినాడలో వీధి శునకాలకు చికెన్​ బిర్యానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.