విశాఖలో భీమిలి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమునిపట్నం స్థానిక మినీ క్రీడా మైదానంలో ఎడ్లబండ్ల పోటీలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 25 ఎడ్లబండ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ పోటీలను తిలకించేందుకు పలువురు ఆసక్తి చూపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులకు పలు క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: