విశ్రాంత బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ పెంచాలంటూ... అఖిల భారత బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సమాఖ్య విశాఖలో ధర్నా చేపట్టింది. ఆంధ్ర బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. బ్యాంకు యాజమాన్యాలు తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం రిటైర్ అయిన ఉద్యోగి పెన్షన్ ఎంత ఉందో... ఇప్పటికీ అంతే కొనసాగించటం శోచనీయమని వాపోయారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ పెన్షన్లు సరిపోక కుటుంబ పోషణ భారంగా మారుతోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా తమ పెన్షన్ కూడా పెంచాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'ప్రశాంత విశాఖలో రౌడీ సంస్కృతిని తీసుకొస్తున్నారు'