కరోనా సహాయక చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్ల సంఘం ఆధ్వర్యంలో విశాఖలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వలస కూలీలకు ఆహారం అందజేశారు. విశాఖ నుంచి ప్రత్యేక బస్సులు, లారీలు, టాక్సీలు, ఆటోలలో స్వస్థలాలకు బయలుదేరుతున్న వలస కూలీలకు జాతీయ రహదారిపై.. కార్పెంటర్ల సంఘం ప్రతినిధులు భోజనం పంచారు. పెరుగన్నం, అరటి పళ్ళు, వాటర్ ప్యాకెట్లు సుమారు 500 మందికి అందించారు.
ఇవీ చదవండి... క్వారంటైన్లో ఉన్న వలస కూలీలకు కరోనా పరీక్షలు