కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కష్టకాలంలో ఇబ్బందిపడుతున్న ప్రజలను ఎందరో సేవామూర్తులు మానవత్వంతో ఆదుకుంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరి గ్రామానికి చెందిన అంబేడ్కర్ యూత్ సభ్యులు సొంతంగా డబ్బులు సమకూర్చుకుని సాయం చేశారు. తొమ్మిది రకాల కూరగాయలను కొనుగోలు చేసి, స్వయంగా యువత ఇంటింటికీ వెళ్లి వందకు పైగా నిరుపేద కుటుంబాలకు అందజేశారు.
ఇదీ చూడండి. 'ఆనందయ్య మందుకు అనుమతి వస్తే.. ఔషధం తయారీకి తితిదే సిద్ధం'