ETV Bharat / state

80 శాతం విమాన ప్రయాణికులు ఆ మూడు నగరాల మధ్యే !

author img

By

Published : Oct 10, 2020, 6:38 AM IST

హైదరాబాద్, దిల్లీ, బెంగళూరుకు విమాన ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 6 నెలల్లో విమాన ప్రయాణికుల నుంచి పురోగతి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా విమానాల సంఖ్య తక్కువగా నడుస్తుండటంతో విమానాలు మారి తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా కొన్ని నగరాల్ని ఎంచుకుంటున్నారు. విశాఖ నుంచి వాటి మధ్యే జనం ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ మేరకు విశాఖ ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెల్లడించింది.

80 శాతం విమాన ప్రయాణికులు ఆ మూడు నగరాల మధ్యే !
80 శాతం విమాన ప్రయాణికులు ఆ మూడు నగరాల మధ్యే !
80 శాతం విమాన ప్రయాణికులు ఆ మూడు నగరాల మధ్యే !

దేశీయ ప్రయాణికులు ( మే నుంచి సెప్టెంబరు మధ్య విశాఖ నుంచి రాకపోకలు చేసినవారు)

హైదరాబాద్‌ - 83,136

దిల్లీ - 54,611

బెంగళూరు - 48,377

చెన్నై - 16,025

కోల్‌కతా 15,795

ముంబయి - 8276

అంతర్జాతీయ ప్రయాణికులు (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య విశాఖకు వచ్చినవారు)

కువైట్‌ - 1005

దోహా - 862

దుబాయ్‌ - 710

బిష్కెక్‌ - 697

షార్జా - 403

రస్‌-అల్‌-ఖైమా (యూఏఈ) - 361

దమ్మామ్‌ - 352

మస్కట్‌ - 327

లండన్‌ - 287

బోరిస్పోల్‌ - 275

కౌలాలంపూర్‌ - 245

మనీలా - 244

రియాద్‌ - 167

ధాకా - 150

అబుదాబి - 148

సిడ్నీ - 86

మెల్‌బోర్న్‌ - 45

జాతీయ ప్రయాణికులు - 2,23,939

అంతర్జాతీయ ప్రయాణికులు - 6516

మొత్తం ప్రయాణికులు - 2,30,455

రాకపోకలు చేసిన విమానాలు - 2,745

(ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు దాకా)

ఎక్కువ మంది ప్రయాణికులు విశాఖ నుంచి హైదరాబాద్, దిల్లీ, బెంగళూరుల మధ్యే ప్రయాణాలు సాగిస్తున్నారు. గత 6 మాసాల్లో మొత్తం ప్రయాణికుల్ని గమనిస్తే.. ఏకంగా 1,86,124 మంది ఈ 3 నగరాలకే రాకపోకలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే.. 80.76 శాతం మంది విశాఖ నుంచి ఆయా గమ్యస్థానాలకు రాకపోకలు సాగించారు.

ఆ 3 రూట్ల మధ్యే డిమాండ్ ఎక్కువ..

హైదరాబాద్, దిల్లీ, బెంగళూరుల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనువైన విమానాలు నడుస్తున్నాయి. ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లాల్సినవారు దిల్లీకి, తూర్పు, మధ్య రాష్ట్రాలకు వెళ్లాల్సినవారు హైదరాబాద్‌కు, కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లాల్సినవారు బెంగళూరు విమానాశ్రయాల్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూడు రూట్ల మధ్య ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. ప్రస్తుతం విశాఖ నుంచి హైదరాబాద్‌కు 5, బెంగళూరుకు 4, దిల్లీకి 3 విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

ఇక్కడే సామర్థ్యం ఎక్కువ..

విమానాశ్రయంమేజూన్జులైఆగస్టుసెప్టెంబరుమొత్తం
విశాఖపట్నం7,95839,67342,15360,92079,7272,30,431
విజయవాడ4,84818,93420,95330,38737,8841,13,006
రాజమహేంద్రవరం6815,6397,71410,35814,52538,917

విశాఖలోనే నిండు సామర్థ్యం..

విమానాల్లో సీట్లు నిండు సామర్థ్యం విశాఖలోనే ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా తక్కువ విమానాలు తిరుగుతున్నా.. ఎక్కువమంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత విమానాశ్రయాల్లో తక్కువ విమానాలనే అనుమతిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలతో పోల్చితే విశాఖనే ఎక్కువమంది ఆశ్రయిస్తున్నారు.

విజయవాడకే ఎక్కువ విమానాలు..

వందే భారత్‌ విమానాల పరంగా విజయవాడకు ఎక్కువ విమానాలొచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చిన విదేశీ ప్రయాణికులు విజయవాడలోనే అధికంగా దిగారు. ఫలితంగా అక్కడ ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లుగా పేర్కొ న్నారు. విశాఖలో గత 6 మాసాల్లో 45 విమానాలు విదేశాల నుంచి వచ్చాయని అధికారులు వెల్లడించారు. మొత్తం ప్రయాణికుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 2.82 శాతమున్నారని వివరించారు. ప్రస్తుతం విశాఖ నుంచి రోజుకు సుమారు 16 నుంచి 18 విమాన సర్వీసులు రాకపోకలు చేస్తున్నాయి. విమాన సర్వీసులు పెంచే విషయమై చర్చలు జరుపుతున్నామని విమానాశ్రయ డైరెక్టర్‌ రాజకిషోర్‌ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'ఆ రోజున అమరావతి కోసం రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటి కావాలి'

80 శాతం విమాన ప్రయాణికులు ఆ మూడు నగరాల మధ్యే !

దేశీయ ప్రయాణికులు ( మే నుంచి సెప్టెంబరు మధ్య విశాఖ నుంచి రాకపోకలు చేసినవారు)

హైదరాబాద్‌ - 83,136

దిల్లీ - 54,611

బెంగళూరు - 48,377

చెన్నై - 16,025

కోల్‌కతా 15,795

ముంబయి - 8276

అంతర్జాతీయ ప్రయాణికులు (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య విశాఖకు వచ్చినవారు)

కువైట్‌ - 1005

దోహా - 862

దుబాయ్‌ - 710

బిష్కెక్‌ - 697

షార్జా - 403

రస్‌-అల్‌-ఖైమా (యూఏఈ) - 361

దమ్మామ్‌ - 352

మస్కట్‌ - 327

లండన్‌ - 287

బోరిస్పోల్‌ - 275

కౌలాలంపూర్‌ - 245

మనీలా - 244

రియాద్‌ - 167

ధాకా - 150

అబుదాబి - 148

సిడ్నీ - 86

మెల్‌బోర్న్‌ - 45

జాతీయ ప్రయాణికులు - 2,23,939

అంతర్జాతీయ ప్రయాణికులు - 6516

మొత్తం ప్రయాణికులు - 2,30,455

రాకపోకలు చేసిన విమానాలు - 2,745

(ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు దాకా)

ఎక్కువ మంది ప్రయాణికులు విశాఖ నుంచి హైదరాబాద్, దిల్లీ, బెంగళూరుల మధ్యే ప్రయాణాలు సాగిస్తున్నారు. గత 6 మాసాల్లో మొత్తం ప్రయాణికుల్ని గమనిస్తే.. ఏకంగా 1,86,124 మంది ఈ 3 నగరాలకే రాకపోకలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే.. 80.76 శాతం మంది విశాఖ నుంచి ఆయా గమ్యస్థానాలకు రాకపోకలు సాగించారు.

ఆ 3 రూట్ల మధ్యే డిమాండ్ ఎక్కువ..

హైదరాబాద్, దిల్లీ, బెంగళూరుల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనువైన విమానాలు నడుస్తున్నాయి. ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లాల్సినవారు దిల్లీకి, తూర్పు, మధ్య రాష్ట్రాలకు వెళ్లాల్సినవారు హైదరాబాద్‌కు, కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లాల్సినవారు బెంగళూరు విమానాశ్రయాల్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూడు రూట్ల మధ్య ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. ప్రస్తుతం విశాఖ నుంచి హైదరాబాద్‌కు 5, బెంగళూరుకు 4, దిల్లీకి 3 విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

ఇక్కడే సామర్థ్యం ఎక్కువ..

విమానాశ్రయంమేజూన్జులైఆగస్టుసెప్టెంబరుమొత్తం
విశాఖపట్నం7,95839,67342,15360,92079,7272,30,431
విజయవాడ4,84818,93420,95330,38737,8841,13,006
రాజమహేంద్రవరం6815,6397,71410,35814,52538,917

విశాఖలోనే నిండు సామర్థ్యం..

విమానాల్లో సీట్లు నిండు సామర్థ్యం విశాఖలోనే ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా తక్కువ విమానాలు తిరుగుతున్నా.. ఎక్కువమంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత విమానాశ్రయాల్లో తక్కువ విమానాలనే అనుమతిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలతో పోల్చితే విశాఖనే ఎక్కువమంది ఆశ్రయిస్తున్నారు.

విజయవాడకే ఎక్కువ విమానాలు..

వందే భారత్‌ విమానాల పరంగా విజయవాడకు ఎక్కువ విమానాలొచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చిన విదేశీ ప్రయాణికులు విజయవాడలోనే అధికంగా దిగారు. ఫలితంగా అక్కడ ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లుగా పేర్కొ న్నారు. విశాఖలో గత 6 మాసాల్లో 45 విమానాలు విదేశాల నుంచి వచ్చాయని అధికారులు వెల్లడించారు. మొత్తం ప్రయాణికుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 2.82 శాతమున్నారని వివరించారు. ప్రస్తుతం విశాఖ నుంచి రోజుకు సుమారు 16 నుంచి 18 విమాన సర్వీసులు రాకపోకలు చేస్తున్నాయి. విమాన సర్వీసులు పెంచే విషయమై చర్చలు జరుపుతున్నామని విమానాశ్రయ డైరెక్టర్‌ రాజకిషోర్‌ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'ఆ రోజున అమరావతి కోసం రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటి కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.