ETV Bharat / state

పెళ్లి విషయం ఎక్కడ బయటపడుతుందోనని.. ఆత్మహత్య

యువకుడితో ఏర్పడిన పరిచయంతో వివాహం చేసుకొంది. కానీ ఆ విషయం బయటకు తెలిస్తే కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయని భావించిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పొన్నుటురు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

author img

By

Published : Nov 17, 2020, 10:13 AM IST

woman suicide
వివాహిత ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పొన్నుటురు గ్రామానికి చెందిన ఓ వివాహిత ఫ్యాన్​కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు హైదరాబాద్​లో ఉంటుండగా.. నాన్నమ్మ ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నవీన్​ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం.. ఇటీవల వివాహం చేసుకుంది. ఈ విషయం బయటకు తెలియడం.. కుటుంబ సభ్యులకు అవమానం కలుగుతుందనే ఉద్దేశంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి...

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పొన్నుటురు గ్రామానికి చెందిన ఓ వివాహిత ఫ్యాన్​కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు హైదరాబాద్​లో ఉంటుండగా.. నాన్నమ్మ ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నవీన్​ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం.. ఇటీవల వివాహం చేసుకుంది. ఈ విషయం బయటకు తెలియడం.. కుటుంబ సభ్యులకు అవమానం కలుగుతుందనే ఉద్దేశంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి...

శ్రీముఖలింగం ఆలయంలో వైభవంగా కార్తీక మాస ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.