ETV Bharat / state

కరోనా కల్యాణం.. కానరాని వైభోగం !!

author img

By

Published : Aug 13, 2020, 11:32 AM IST

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు.. జీవితంలో మధురానుభూతిని ఇచ్చే వివాహాన్ని ఎంతో ఆడంబరంగా నిర్వహించుకునేవారు. పెళ్లికి పది రోజుల ముందు నుంచే బంధువులు, సన్నిహితులతో ఆ ఇళ్లు కళకళలాడేది. మిరుమిట్లు గొలిపే విద్యుత్తు అలంకరణలు..భాజాభజంత్రీలతో ఓ పండగలా చేసుకునేవారు. ఆ సందడికి కరోనా కళ్లెం వేసింది. వివాహం చేసుకోవాలంటే తప్పని సరిగా అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాల్సి ఉంది.

కరోనా కల్యాణం.. కానరాని వైభోగం !!
కరోనా కల్యాణం.. కానరాని వైభోగం !!

కరోనా వేళ కళ్యాణమే తప్ప వైభోగం లేకుండా పెళ్లిళ్లు చేసుకోడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవడం తప్పిస్తే ఇతరత్రా కార్యకలాపాలకు అవకాశం ఇవ్వడం లేదు. ఇరు వర్గాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించి నిబంధనలు పాటించి వివాహం చేసుకోడానికి అనుమతులు ఇస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు వివాహ ముహూర్తాలు ఉండడంతో అధిక సంఖ్య లోనే పెళ్లిళ్లకు సమాయత్తమవుతున్నారు. లక్షల్లో చేసే వ్యయం మిగలడం తోపాటు అందరినీ పిలిచి హంగామా చేసే ప్రయాస తగ్గుతుందనే భావనతో చాలా జంటలు ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

20 మందికే అనుమతి..

వివాహం సమయంలో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. వీరంతా భౌతిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు, శానిటైజర్లు వినియోగించాల్సి ఉంటుంది. వివాహం ముగిసేంతవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

దంపతులకు కరోనా పరీక్షలు .. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కరోనా లేనట్లయితే అందుకు సంబంధించిన పత్రం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. కరోనా సోకితే వివాహాలకు అనుమతి ఉండదు.

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి పూర్తి వివరాలతో దరఖాస్తు చేస్తే అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు ఇస్తారు.దీనికి గాను వధువు, వరుడు కుటుంబాలకు సంబంధించి కేవలం 20 మందితో మాత్రమే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ పెళ్లి జరుగుతుందో సంబంధిత కుటుంబ సభ్యులు, వధువు, వరుడు ఆధార్‌ వివరాలు, లగ్నపత్రిక, ఇతర సమాచారంతో కూడిన దరఖాస్తు తహసీల్దార్‌ తోపాటు పోలీసు స్టేషన్‌కు అందజేయాలి.తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పోలీసుస్టేషన్‌కు సమాచారం పంపిస్తారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటికే 15 వందలకు పైగా పెళ్లిళ్లు జరగగా మరో 16 వందల దరఖాస్తులకు అనుమతులిచ్చారు.

ఆగస్టు నుంచి ...:

జులై నెల వరకు ...: పెళ్లిళ్లు చేసుకోవాలంటే జిల్లా కలెక్టర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉండేది.వివాహ ముహూర్తాలు అధికంగా ఉండడం ఒక్కో ముహూర్తానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం ఇతర ఇబ్బందుల నేపథ్యంలో అనుమతులిచ్చే బాధ్యతలను కలెక్టర్‌ నుంచి తహసీల్దార్లకు బదిలీ చేశారు.

ఇవి తప్పనిసరి

● వివాహం జరిగే ప్రదేశం ● పెళ్లి తేది, సమయం తెలియజేస్తూ దరఖాస్తును అందజేయాలి. ● వధూవరులతో పాటు పెళ్లికి హాజరయ్యే 20 మంది బంధువుల ఆధార్‌ ప్రతులు ● శుభలేఖ ● రూ.పది విలువ చేసే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పై అఫిడవిట్‌ జతచేయాలి.

  • నిబంధనలు పాటించాలి

ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేనిపక్షంలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఒక్క వివాహాలకే అనుమతిని నిబంధనలు ప్రకారం ఇచ్చింది. మరే ఇతర వాటికి అనుమతులు లేవు. - ఎం.గణపతి, తహసీల్దార్‌, వీరఘట్టం

  • విస్మరిస్తే చర్యలు

కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు చేసుకునేవారు విధిగా నిబంధనలు పాటించాలి. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు సమర్పిస్తే పరిశీలించి అనుమతులు ఇస్తున్నాం. పెళ్లి జరిగే ప్రాంతాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారమిస్తాం. - ఎస్‌.గురుప్రసాద్‌, తహసీల్దారు, సోంపేట

  • జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుతం 1,600 దరఖాస్తులకు అనుమతులిచ్చాం. కరోనా విజృంభిస్తున్నందున అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నియమిత కుటుంబ సభ్యులతోనే వివాహాలు నిర్వహించాలి. కొవిడ్‌ నిబంధనలు మీరితే కేసులు నమోదు చేస్తాం. - బి.దయానిధి, డీఆర్వో, శ్రీకాకుళం

ఇవీ చదవండి

దొనుబై సమీపంలో పేకాట శిబిరంపై దాడి

కరోనా వేళ కళ్యాణమే తప్ప వైభోగం లేకుండా పెళ్లిళ్లు చేసుకోడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవడం తప్పిస్తే ఇతరత్రా కార్యకలాపాలకు అవకాశం ఇవ్వడం లేదు. ఇరు వర్గాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించి నిబంధనలు పాటించి వివాహం చేసుకోడానికి అనుమతులు ఇస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు వివాహ ముహూర్తాలు ఉండడంతో అధిక సంఖ్య లోనే పెళ్లిళ్లకు సమాయత్తమవుతున్నారు. లక్షల్లో చేసే వ్యయం మిగలడం తోపాటు అందరినీ పిలిచి హంగామా చేసే ప్రయాస తగ్గుతుందనే భావనతో చాలా జంటలు ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

20 మందికే అనుమతి..

వివాహం సమయంలో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. వీరంతా భౌతిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు, శానిటైజర్లు వినియోగించాల్సి ఉంటుంది. వివాహం ముగిసేంతవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

దంపతులకు కరోనా పరీక్షలు .. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కరోనా లేనట్లయితే అందుకు సంబంధించిన పత్రం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. కరోనా సోకితే వివాహాలకు అనుమతి ఉండదు.

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి పూర్తి వివరాలతో దరఖాస్తు చేస్తే అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు ఇస్తారు.దీనికి గాను వధువు, వరుడు కుటుంబాలకు సంబంధించి కేవలం 20 మందితో మాత్రమే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ పెళ్లి జరుగుతుందో సంబంధిత కుటుంబ సభ్యులు, వధువు, వరుడు ఆధార్‌ వివరాలు, లగ్నపత్రిక, ఇతర సమాచారంతో కూడిన దరఖాస్తు తహసీల్దార్‌ తోపాటు పోలీసు స్టేషన్‌కు అందజేయాలి.తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పోలీసుస్టేషన్‌కు సమాచారం పంపిస్తారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటికే 15 వందలకు పైగా పెళ్లిళ్లు జరగగా మరో 16 వందల దరఖాస్తులకు అనుమతులిచ్చారు.

ఆగస్టు నుంచి ...:

జులై నెల వరకు ...: పెళ్లిళ్లు చేసుకోవాలంటే జిల్లా కలెక్టర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉండేది.వివాహ ముహూర్తాలు అధికంగా ఉండడం ఒక్కో ముహూర్తానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం ఇతర ఇబ్బందుల నేపథ్యంలో అనుమతులిచ్చే బాధ్యతలను కలెక్టర్‌ నుంచి తహసీల్దార్లకు బదిలీ చేశారు.

ఇవి తప్పనిసరి

● వివాహం జరిగే ప్రదేశం ● పెళ్లి తేది, సమయం తెలియజేస్తూ దరఖాస్తును అందజేయాలి. ● వధూవరులతో పాటు పెళ్లికి హాజరయ్యే 20 మంది బంధువుల ఆధార్‌ ప్రతులు ● శుభలేఖ ● రూ.పది విలువ చేసే నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పై అఫిడవిట్‌ జతచేయాలి.

  • నిబంధనలు పాటించాలి

ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేనిపక్షంలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఒక్క వివాహాలకే అనుమతిని నిబంధనలు ప్రకారం ఇచ్చింది. మరే ఇతర వాటికి అనుమతులు లేవు. - ఎం.గణపతి, తహసీల్దార్‌, వీరఘట్టం

  • విస్మరిస్తే చర్యలు

కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు చేసుకునేవారు విధిగా నిబంధనలు పాటించాలి. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు సమర్పిస్తే పరిశీలించి అనుమతులు ఇస్తున్నాం. పెళ్లి జరిగే ప్రాంతాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారమిస్తాం. - ఎస్‌.గురుప్రసాద్‌, తహసీల్దారు, సోంపేట

  • జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుతం 1,600 దరఖాస్తులకు అనుమతులిచ్చాం. కరోనా విజృంభిస్తున్నందున అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నియమిత కుటుంబ సభ్యులతోనే వివాహాలు నిర్వహించాలి. కొవిడ్‌ నిబంధనలు మీరితే కేసులు నమోదు చేస్తాం. - బి.దయానిధి, డీఆర్వో, శ్రీకాకుళం

ఇవీ చదవండి

దొనుబై సమీపంలో పేకాట శిబిరంపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.