ETV Bharat / state

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

author img

By

Published : Feb 20, 2021, 11:25 AM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బాలాజినగర్​లో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. రూ.1.5 లక్షల విలువైన బంగారు నగలను దుండగులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

theft at locked house in pathapatnam at srikakulam district
గేటు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బాలాజినగర్​లో గురువారం అర్థరాత్రి చోరి జరిగింది. అర్థరాత్రి 2 గంటల తరువాత దుండగులు బాలాజీనగర్​లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చొరబడ్డట్లు.. స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. గేటుకు ఉన్న గడియలను విరగ్గొట్టి దుండగులు లోపలకు ప్రవేశించారు.

రెండు రోజుల కిందట స్వగ్రామానికి వెళ్లిన డా.అనిత ఇంట్లో రూ.1.5లక్షల విలువగల బంగారు ఆభరణాలను అపహరించారు. శ్రీకాకుళం వచ్చిన క్లూస్ టీం.. గేటు, బీరువా తలుపులపై ఉన్న వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ అలీ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బాలాజినగర్​లో గురువారం అర్థరాత్రి చోరి జరిగింది. అర్థరాత్రి 2 గంటల తరువాత దుండగులు బాలాజీనగర్​లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చొరబడ్డట్లు.. స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. గేటుకు ఉన్న గడియలను విరగ్గొట్టి దుండగులు లోపలకు ప్రవేశించారు.

రెండు రోజుల కిందట స్వగ్రామానికి వెళ్లిన డా.అనిత ఇంట్లో రూ.1.5లక్షల విలువగల బంగారు ఆభరణాలను అపహరించారు. శ్రీకాకుళం వచ్చిన క్లూస్ టీం.. గేటు, బీరువా తలుపులపై ఉన్న వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ అలీ తెలిపారు.

ఇదీ చదవండి:

మంత్రి ప్రకటన అలా... విద్యా శాఖ ఉత్తర్వులు ఇలా!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.