ETV Bharat / state

అన్ని జిల్లాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి బొత్స - The government's goal is to develop 13 districts newsupdates

విశాఖపట్నంలో ఇన్‌సైడర్​ ట్రేడింగ్‌ జరిగిందన్న ఆరోపణలు సరైనవి కావని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆధారాలతో వస్తే విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.

The government's goal is to develop 13  districts
పదమూడు జిల్లాల అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం..మంత్రి బొత్స
author img

By

Published : Dec 29, 2019, 8:17 PM IST

పదమూడు జిల్లాల అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం..మంత్రి బొత్స

మూడు రాజధానులపై అధికారిక ప్రకటన రాకముందే ఇలాంటి ఆరోపణలు సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా రాగోలు తోటలో నిర్వహించిన తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఆయన.. తెదేపా హయాంలో భూఆరోపణలు వచ్చినా ఏనాడు విచారణ జరపలేదన్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి వైకాపా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఒక ప్రాంతానికి లబ్ది చేకూర్చి... మరో ప్రాంతాన్ని విస్మరించాలన్న ఉద్దేశ్యం మాకు లేదన్నారు. అమరావతిలో బాలకృష్ణ వియ్యంకుడికి 4 వందల 98 ఎకరాలు కట్టబెట్టారని.. రాజధాని ప్రాంతంలో అక్రమాలు జరిగాయనడానికి ఇదొక నిదర్శనమన్నారు. చంద్రబాబులా తమకు అవకాశవాద రాజకీయాలు తెలియవన్నారు మంత్రి బొత్స.

ఇదీ చదవండి:'రాజధానిపై ఆ కమిటీ నివేదికదే తుది నిర్ణయం'

పదమూడు జిల్లాల అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం..మంత్రి బొత్స

మూడు రాజధానులపై అధికారిక ప్రకటన రాకముందే ఇలాంటి ఆరోపణలు సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా రాగోలు తోటలో నిర్వహించిన తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఆయన.. తెదేపా హయాంలో భూఆరోపణలు వచ్చినా ఏనాడు విచారణ జరపలేదన్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి వైకాపా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఒక ప్రాంతానికి లబ్ది చేకూర్చి... మరో ప్రాంతాన్ని విస్మరించాలన్న ఉద్దేశ్యం మాకు లేదన్నారు. అమరావతిలో బాలకృష్ణ వియ్యంకుడికి 4 వందల 98 ఎకరాలు కట్టబెట్టారని.. రాజధాని ప్రాంతంలో అక్రమాలు జరిగాయనడానికి ఇదొక నిదర్శనమన్నారు. చంద్రబాబులా తమకు అవకాశవాద రాజకీయాలు తెలియవన్నారు మంత్రి బొత్స.

ఇదీ చదవండి:'రాజధానిపై ఆ కమిటీ నివేదికదే తుది నిర్ణయం'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.