ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న 'ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ' కార్యక్రమానికి...వచ్చే నెల ఒకటో తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. తొలిసారిగా ఈ పథకం జిల్లా నుంచి ప్రారంభం కానుందని జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీకాకుళం మండల స్థాయి గిడ్డంగి నుంచి చౌకధర దుకాణాలకు నాణ్యమైన బియ్యం సరఫరా కార్యక్రమాన్ని జేసీ లాంఛనంగా ప్రారంభించారు. గ్రామవాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
ఇదీ చూడండి: శ్రీకాకుళం జిల్లా నుంచే సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం