ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను రవాణాను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు అంబులెన్స్లో వందకుపైగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని హడ్డుబంగి వద్ద సరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ గుట్కా ప్యాకెట్ల వాహనం శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం వెళ్తుండగా కోమర్తి కూడలి వద్ద పోలీసులు అటకాయించి పట్టుకున్నారు. వీటి విలువ రూ. 6 లక్షలు ఉంటుందని నరసన్నపేట సీఐ తిరుపతి రావు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. పట్టుబడిన వాహనం, గుట్కా ప్యాకెట్లు సీజ్ చేసినట్లు సీఐ తెలియజేశారు.
ఇదీ చదవండి :