ETV Bharat / state

పలాసలో ఆక్సిజన్ ఆన్ వీల్స్​ను ప్రారంభించిన మంత్రి సీదిరి అప్పలరాజు

author img

By

Published : May 25, 2021, 9:45 PM IST

తూర్పు నావికాదళం పలాసలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్​ ఆల్​ వీల్స్​ను మంత్రి సీదిరి అప్పల రాజు ప్రారంభించారు. దీని వల్ల రోగులకు నిరంతర ఆక్సిజన్​ సరఫరా అందుతుందని ఆయన అన్నారు.

oxygen on wheels at palasa
పలాసలో ఆక్సిజన్ ఆన్ వీల్స్ ను ప్రారంభించిన మంత్రి

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆక్సిజన్ సరఫరా కోసం చేసిన విజ్ఞప్తికి తూర్పు నావికాదళం స్పందించింది. తూర్పు నావికాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేంద్ర బహదూర్ సింగ్ రూపకల్పన చేసిన ఆక్సిజన్ ఆన్ వీల్స్​ను పలాసలో మంత్రి అప్పల రాజు మంగళవారం ప్రారంభించారు. విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ నిపుణుల బృందం దీని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. ఆసుపత్రి సిబ్బందికి దీని వినియోగం, నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.

oxygen on wheels at palasa
ఆక్సిజన్ ఆన్ వీల్స్ వాహనం

సొంతంగా రూపకల్పన చేసిన ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్లాంటును పలాసలోని కొవిడ్ కేర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వారికి నిరాటంకంగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సీదిరి అప్పలరాజు అభిప్రాయపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆక్సిజన్ సరఫరా కోసం చేసిన విజ్ఞప్తికి తూర్పు నావికాదళం స్పందించింది. తూర్పు నావికాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేంద్ర బహదూర్ సింగ్ రూపకల్పన చేసిన ఆక్సిజన్ ఆన్ వీల్స్​ను పలాసలో మంత్రి అప్పల రాజు మంగళవారం ప్రారంభించారు. విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ నిపుణుల బృందం దీని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. ఆసుపత్రి సిబ్బందికి దీని వినియోగం, నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.

oxygen on wheels at palasa
ఆక్సిజన్ ఆన్ వీల్స్ వాహనం

సొంతంగా రూపకల్పన చేసిన ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్లాంటును పలాసలోని కొవిడ్ కేర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వారికి నిరాటంకంగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సీదిరి అప్పలరాజు అభిప్రాయపడ్డారు.

oxygen on wheels at palasa
ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను పరిశీలిస్తున్న మంత్రి

ఇవీ చదవండి:

చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు ఉంటుంది?

తుపాను ముప్పుపై ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.