ETV Bharat / state

లారీ పై నుంచి పడి.. డ్రైవర్ మృతి - నరసన్నపేటలో లారీ డ్రైవర్ మృతి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్​గేట్​ వద్ద లారీపై నిద్రిస్తూ డ్రైవర్ జారిపడి మరణించాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

orrissa lorry driver died at narasannpet by felling from lorry
మృతి చెందిన ప్రతాప్‌ గౌడ
author img

By

Published : Aug 31, 2020, 8:37 AM IST

నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్‌ సమీపంలో లారీ పై నుంచి పడి డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు ఒడిశాకు చెందిన డ్రైవర్​గా గుర్తించారు. ఒడిశాలోని గంజాం జిల్లా చీకటి సమితి జగన్నాధపురం గ్రామానికి చెందిన ప్రతాప్‌ గౌడ(37) లారీ పై నిద్రిస్తూ జారి పడి మృతి చెందారు. బరంపురం నుంచి ఊక లోడుతో బయలుదేరిన లారీ ఈనెల 28న రాత్రి మడపాం టోల్‌గేట్​కు చేరుకుంది. అక్కడ లారీని నిలిపివేసి లారీ పై నిద్రించగా, మత్తులో లారీ పై నుంచి జారి పడినట్లు సమీప బంధువు ఫిర్యాదు చేశారు. లారీపై నుంచి జారి పడిన ప్రతాప్‌ గౌడను శ్రీకాకుళం రిమ్స్‌ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసినట్లు తెలిపారు.

నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్‌ సమీపంలో లారీ పై నుంచి పడి డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు ఒడిశాకు చెందిన డ్రైవర్​గా గుర్తించారు. ఒడిశాలోని గంజాం జిల్లా చీకటి సమితి జగన్నాధపురం గ్రామానికి చెందిన ప్రతాప్‌ గౌడ(37) లారీ పై నిద్రిస్తూ జారి పడి మృతి చెందారు. బరంపురం నుంచి ఊక లోడుతో బయలుదేరిన లారీ ఈనెల 28న రాత్రి మడపాం టోల్‌గేట్​కు చేరుకుంది. అక్కడ లారీని నిలిపివేసి లారీ పై నిద్రించగా, మత్తులో లారీ పై నుంచి జారి పడినట్లు సమీప బంధువు ఫిర్యాదు చేశారు. లారీపై నుంచి జారి పడిన ప్రతాప్‌ గౌడను శ్రీకాకుళం రిమ్స్‌ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'నూతన్​నాయుడుతో నాకు ప్రాణహాని ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.