ETV Bharat / state

శ్రీకాకుళంలో ఎన్నికల సిబ్బందికి ఆకలి పాట్లు - పాతపట్నం, సంతబొమ్మాళి మండలాల్లో ఎన్నికల సిబ్బందికి ఆకలి పాట్లు

మధ్యాహ్నం భోజనాలు అందక.. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంతబొమ్మాళి, పాతపట్నం మండలాల్లో పులువురు ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. కనీసం సరిపడా మంచినీరు, టీ, బిస్కెట్లూ ఇవ్వలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనేకమంది బయటి ప్రాంతాలకు వెళ్లి భోజనం చేయాల్సి వచ్చింది.

election officers protests as no food in srikakulam district
శ్రీకాకుళంలో ఎన్నికల సిబ్బందికి ఆకలి పాట్లు
author img

By

Published : Feb 6, 2021, 6:07 PM IST

శ్రీకాకుళంలో ఎన్నికల సిబ్బందికి ఆకలి పాట్లు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సిబ్బంది ఆకలితో అలమటించారు. 800 మందికి పంచాయతీ ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అందుకు హాజరైన పీవోలు, ఆర్వోలకు మధ్యాహ్నం భోజనాలు సరిపడా అందించలేదు. ఆహారం సరిపోలేదంటూ దాదాపు 300 మంది నిరసనకు దిగారు. కనీసం సరిపడా మంచి నీరు ఇవ్వలేదని.. టీ, బిస్కెట్లు సైతం ఇవ్వకపోవడం దారుణమంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1.30 దాటినా భోజనాలు వండుతుండటంతో చాలామంది బయటి ప్రాంతాలకు వెళ్లి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాతపట్నం మండలంలో ఎన్నికల విధులకు వచ్చిన ఉపాధ్యాయులకూ భోజనాలు లేకపోవడంతో నిరసనకు దిగారు. ఎంపీడీవో, ఎమ్మార్వో డౌన్ డౌన్ అంటూ బ్రిడ్జి పాఠశాల ఆవరణలో నినాదాలు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు భోజనాలు అందించకుండా.. కొంతమందికి ఆహారం ఉందని.. మరికొందరికి లేదని చెప్పారంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

గొల్లపేటలో అగ్నిప్రమాదం.. 15 పూరిళ్లు దగ్ధం

శ్రీకాకుళంలో ఎన్నికల సిబ్బందికి ఆకలి పాట్లు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సిబ్బంది ఆకలితో అలమటించారు. 800 మందికి పంచాయతీ ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అందుకు హాజరైన పీవోలు, ఆర్వోలకు మధ్యాహ్నం భోజనాలు సరిపడా అందించలేదు. ఆహారం సరిపోలేదంటూ దాదాపు 300 మంది నిరసనకు దిగారు. కనీసం సరిపడా మంచి నీరు ఇవ్వలేదని.. టీ, బిస్కెట్లు సైతం ఇవ్వకపోవడం దారుణమంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1.30 దాటినా భోజనాలు వండుతుండటంతో చాలామంది బయటి ప్రాంతాలకు వెళ్లి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాతపట్నం మండలంలో ఎన్నికల విధులకు వచ్చిన ఉపాధ్యాయులకూ భోజనాలు లేకపోవడంతో నిరసనకు దిగారు. ఎంపీడీవో, ఎమ్మార్వో డౌన్ డౌన్ అంటూ బ్రిడ్జి పాఠశాల ఆవరణలో నినాదాలు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు భోజనాలు అందించకుండా.. కొంతమందికి ఆహారం ఉందని.. మరికొందరికి లేదని చెప్పారంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

గొల్లపేటలో అగ్నిప్రమాదం.. 15 పూరిళ్లు దగ్ధం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.