ETV Bharat / state

శ్రీముఖలింగం ఆలయంలో వైభవంగా కార్తీక మాస ఉత్సవాలు

author img

By

Published : Nov 16, 2020, 7:32 PM IST

కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా శ్రీకాకుళంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. దీపారాధనలు, వ్రత దీక్షలు జరిగాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.

Karthika masam celebrations
వైభవంగా కార్తీక మాస ఉత్సవాలు

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు శ్రీముఖలింగేశ్వరున్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు.

ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. పలువురు శైవభక్తులు వ్రతదీక్షలు చేపట్టారు. నరసన్నపేట మండలం లకిమెరలోని శివాలయం, పోలాకి మండలం దుబ్బాకవాని పేటలోని జగదీశ్వరాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు శ్రీముఖలింగేశ్వరున్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు.

ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. పలువురు శైవభక్తులు వ్రతదీక్షలు చేపట్టారు. నరసన్నపేట మండలం లకిమెరలోని శివాలయం, పోలాకి మండలం దుబ్బాకవాని పేటలోని జగదీశ్వరాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం.. సర్వం శివనామ స్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.