ETV Bharat / state

jawad cyclone effect: శ్రీకాకుళంలో వర్షాలు..కొబ్బరి చెట్టు కూలి మహిళ మృతి

author img

By

Published : Dec 4, 2021, 10:13 AM IST

Updated : Dec 4, 2021, 1:20 PM IST

jawad cyclone effect: శ్రీకాకుళం జిల్లాలో జావద్ తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రకటించారు.

jawad cyclone effect in srikakulam
శ్రీకాకుళంలో తుపాను ప్రభావం
శ్రీకాకుళంలో తుపాను ప్రభావం

jawad cyclone effect: జవాద్​ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం మారడం వల్ల జిల్లావాసులు చలితో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలతో నాగావళి, వంశధార నదులకు వరదలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా.. మడ్డువలస జలాశయం నుంచి నాగావళి నదిలోకి వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

అప్రమత్తంగా ఉండాలి..

నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు.. ప్రత్యేక అధికారి అరుణ్ కుమార్​తో కలిసి కలెక్టర్ సమీక్షిస్తున్నారు.

కొబ్బరి చెట్టు కూలి మహిళ మృతి

జవాద్ తుపాన్ ప్రభావంతో గాలులు భారీగా వీస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపినాథపురంలో కొబ్బరి చెట్టు కూలి ఇందు అనే మహిళ మృతి చెందింది. గాలి వీస్తున్న సమయంలో.. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇందుపై ఒక్కసారిగా కొబ్బరి చెట్టు పడింది. దీంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

women died
మృతి చెందిన ఇందు

ఇదీ చదవండి:

JAWAD CYCLONE EFFECT IN AP: తీవ్ర తుపానుగా జవాద్... రేపు తీరం దాటే అవకాశం

శ్రీకాకుళంలో తుపాను ప్రభావం

jawad cyclone effect: జవాద్​ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం మారడం వల్ల జిల్లావాసులు చలితో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలతో నాగావళి, వంశధార నదులకు వరదలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా.. మడ్డువలస జలాశయం నుంచి నాగావళి నదిలోకి వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

అప్రమత్తంగా ఉండాలి..

నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు.. ప్రత్యేక అధికారి అరుణ్ కుమార్​తో కలిసి కలెక్టర్ సమీక్షిస్తున్నారు.

కొబ్బరి చెట్టు కూలి మహిళ మృతి

జవాద్ తుపాన్ ప్రభావంతో గాలులు భారీగా వీస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపినాథపురంలో కొబ్బరి చెట్టు కూలి ఇందు అనే మహిళ మృతి చెందింది. గాలి వీస్తున్న సమయంలో.. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇందుపై ఒక్కసారిగా కొబ్బరి చెట్టు పడింది. దీంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

women died
మృతి చెందిన ఇందు

ఇదీ చదవండి:

JAWAD CYCLONE EFFECT IN AP: తీవ్ర తుపానుగా జవాద్... రేపు తీరం దాటే అవకాశం

Last Updated : Dec 4, 2021, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.