ETV Bharat / state

శ్రామిక్​ రైలులో జిల్లాకు చేరిన 295 మంది - శ్రీకాకుళం జిల్లాకు చేరిన వలస కార్మికులు తాజా వార్తలు

జిల్లాకు చెందిన 295 మంది వలస కార్మికులు శ్రామిక్​ రైలులో ఆమదాలవలసకు వచ్చినట్లు మండల తహసీల్దార్​ రాంబాబు తెలిపారు. వీరందరిని కోటబొమ్మాలి మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. 550 మంది రావాల్సి ఉండగా ప్రస్తుతం వీరు మాత్రమే చేరుకున్నట్టు చెప్పారు.

immigrans reached amadalavalasa and went to quarantine in kotabommali in srikakulam disrict
సొంత జిల్లాకు చేరిన వలస కార్మికులు
author img

By

Published : May 28, 2020, 9:46 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు శ్రామిక్​ రైలులో 295 వలస కార్మికులు చేరుకున్నట్టు స్థానిక తహసీల్దార్​ పూజారి రాంబాబు తెలిపారు. కవిటి, సోంపేట, మందస మండలం ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు వచ్చినట్లు చెప్పారు. లాక్​డౌన్​తో వేరే రాష్ట్రాల్లో జిల్లాకు చెందిన కూలీలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్​ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వీరిని శ్రామిక్​ రైళ్లలో శ్రీకాకుళం జిల్లాకు తరలించినట్లు పేర్కొన్నారు. 550 మంది వలస కార్మికులు రావాల్సి ఉండగా... 295 మంది మాత్రమే ప్రస్తుతం వచ్చారని అన్నారు. వీరందరిని 11 బస్సుల్లో కోటబొమ్మాలి మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలియజేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు శ్రామిక్​ రైలులో 295 వలస కార్మికులు చేరుకున్నట్టు స్థానిక తహసీల్దార్​ పూజారి రాంబాబు తెలిపారు. కవిటి, సోంపేట, మందస మండలం ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు వచ్చినట్లు చెప్పారు. లాక్​డౌన్​తో వేరే రాష్ట్రాల్లో జిల్లాకు చెందిన కూలీలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్​ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వీరిని శ్రామిక్​ రైళ్లలో శ్రీకాకుళం జిల్లాకు తరలించినట్లు పేర్కొన్నారు. 550 మంది వలస కార్మికులు రావాల్సి ఉండగా... 295 మంది మాత్రమే ప్రస్తుతం వచ్చారని అన్నారు. వీరందరిని 11 బస్సుల్లో కోటబొమ్మాలి మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలియజేశారు.

ఇదీ చదవండి:

స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికుల పడిగాపులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.