శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్టు జిల్లా సంయుక్త పాలనాధికారి శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితోపాటు రాజోలు జెమ్స్ ఆసుపత్రి, పాలకొండ డిగ్రీ కళాశాలల్లో ఈ ప్రక్రియ జరిగిందన్నారు. వ్యాక్సిన్ వేసే కేంద్రంలో.. వ్యాక్సిన్ వేసే గదితోపాటు వేచి ఉండే గది, అబ్జర్వేషన్ గదులు ఏర్పాటు చేశారు. జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో 3 చోట్ల.. రెండు గంటల సమయంలో 75 మందికి నమూనా కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సిన్ సాప్ట్వేర్ పని తీరు బాగుందన్న ఆయన.. ఎంపిక చేసిన వారికి టీకా ఇచ్చారు.
ఇదీ చదవండి: