రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలకు అడ్డేలేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కూల్చడం తప్ప.. కట్టడం రాని పాలకుల వైఖరితో రాష్ట్రంలో శిథిలాలే మిగులుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎర్రంనాయుడు చిల్డ్రన్ పార్క్లో కూల్చివేతలు దారుణమని ట్వీట్ చేశారు. వైకాపా బరితెగింపును అడ్డుకోలేని అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైకాపాకు ఓట్లేసింది ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు కాదని గుర్తించాలని చంద్రబాబు హితవుపలికారు.
-
రాష్ట్రం లో వైసీపీ అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది. కూల్చడం తప్ప కట్టడం రాని ఈ పాలకుల వైఖరితో శిథిలాలే మిగులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో నిర్మాణం లో ఉన్న ఎర్రంనాయుడు చిల్డ్రన్ పార్క్ లో కూల్చివేతలు దారుణం.(1/2) pic.twitter.com/PEd6UfwCzu
— N Chandrababu Naidu (@ncbn) March 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">రాష్ట్రం లో వైసీపీ అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది. కూల్చడం తప్ప కట్టడం రాని ఈ పాలకుల వైఖరితో శిథిలాలే మిగులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో నిర్మాణం లో ఉన్న ఎర్రంనాయుడు చిల్డ్రన్ పార్క్ లో కూల్చివేతలు దారుణం.(1/2) pic.twitter.com/PEd6UfwCzu
— N Chandrababu Naidu (@ncbn) March 27, 2022రాష్ట్రం లో వైసీపీ అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది. కూల్చడం తప్ప కట్టడం రాని ఈ పాలకుల వైఖరితో శిథిలాలే మిగులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో నిర్మాణం లో ఉన్న ఎర్రంనాయుడు చిల్డ్రన్ పార్క్ లో కూల్చివేతలు దారుణం.(1/2) pic.twitter.com/PEd6UfwCzu
— N Chandrababu Naidu (@ncbn) March 27, 2022