శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని కొబ్బరి, జీడిమామిడి తోటల్లో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు, గుణుపల్లి, చీపురుపల్లి పరిధిలోని తోటల్లో కొద్ది రోజులుగా రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయ పనికోసం తోటకు వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోనూ ఇవి తిరుగుతుండంతో మత్స్యకారులు భయపడుతున్నారు.
ఇదీచదవండి.