ETV Bharat / state

వాలంటీర్లు పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ధర్నా - వేలూరు గ్రామ సచివాలయం వద్ద టి. సాలూరు ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన

టి.సాలూరు ఎస్సీ కాలనీ గ్రామస్థులు వేలూరు గ్రామ సచివాలయం వద్ద ఆందోళన చేశారు. తమకు ప్రభుత్వం పథకాలు ఏమీ అందడం లేదంటూ తెలిపారు. వాలంటీర్లు ఉన్నా లేనట్లుగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

t saluru sc colony people protest because of volunteers behavior in prakasam district
టి. సాలూరు ఎస్సీ కాలనీ వాసులు ధర్నా
author img

By

Published : Jul 13, 2020, 8:10 PM IST

ప్రకాశం జిల్లా వేలూరు పంచాయతీ టి.సాలూరు గ్రామం ఎస్సీ కాలనీ వాసులు వేలూరు గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రామ సచివాలయం ద్వారా తమకు ఎటువంటి కార్యక్రమాలను వాలంటీర్లు తెలియపరచడం లేదని వాపోయారు. నీటి సమస్య ఉందంటూ అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా... పట్టించుకున్న దాఖలాలు లేవని కాలనీ వాసులు అన్నారు. తమపై చిన్న చూపు చూడటంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని ఎస్సీ కాలనీకి న్యాయం చేయాలని కోరారు. లేకపోతే ధర్నాను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ విషయంపై స్థానిక నాయకులు కలగచేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి :

ప్రకాశం జిల్లా వేలూరు పంచాయతీ టి.సాలూరు గ్రామం ఎస్సీ కాలనీ వాసులు వేలూరు గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రామ సచివాలయం ద్వారా తమకు ఎటువంటి కార్యక్రమాలను వాలంటీర్లు తెలియపరచడం లేదని వాపోయారు. నీటి సమస్య ఉందంటూ అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా... పట్టించుకున్న దాఖలాలు లేవని కాలనీ వాసులు అన్నారు. తమపై చిన్న చూపు చూడటంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని ఎస్సీ కాలనీకి న్యాయం చేయాలని కోరారు. లేకపోతే ధర్నాను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ విషయంపై స్థానిక నాయకులు కలగచేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి :

టూటిపాల వాలంటీర్ల చర్యలపై మహిళల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.