ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను.. మే ఒకటో తేదీ నుంచి ఐసోలేషన్ కేంద్రంగా మార్చనున్నారు. ఈ కేంద్రంలో సుమారు 150 పడకలతో అన్ని వసతులు సమకూర్చనున్నారు. ఫలితంగా బల్లికురవ, అద్దంకి, పంగులూరు, ముండ్లమూరు, కొరిసపాడు మండలాల్లోని కరోనా రోగులకు ఈ ఐసోలేషన్ కేంద్రం ఉపయుక్తంగా ఉంటుందని స్థానిక ఎమ్మార్వో ప్రభాకర్ రావు తెలిపారు.
ఇదీచదవండి.