ETV Bharat / state

అమరావతి రైతులకు  ప్రకాశం జిల్లా కర్షకుల సంఘీభావం - Amravati farmers latest news update

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో వెంటనే పనులు ప్రారంభించి చిత్తశుద్దిని చాటుకోవాలని ప్రకాశం జిల్లా అమరావతి పరిరక్షణ సమితి రైతులు డిమాండ్​ చేశారు. అమరావతి రైతుల పోరాటం 220వ రోజు సందర్భంగా సంఘీభావం తెలిపారు.

Prakasam farmers
అమరావతి రైతులుకు సంఘీభావం తెలిపిన ప్రకాశం కర్షకులు
author img

By

Published : Jul 24, 2020, 8:17 PM IST


ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామం రైతులు అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతుల పోరాటం 220వ రోజుకు చేరుకున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి నేతలు సురేష్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామస్థులు, రైతులు సంఘీభావం తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరాలంటే అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి కొనసాగించాలని నినదించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల బిల్లును గవర్నర్​కి పంపటం ప్రభుత్వం చేస్తున్న హేయమైన చర్య అని ప్రకాశం జిల్లా తెదేపా లీగల్ సెల్ అద్యక్షుడు పరిటాల సురేష్ విమర్శించారు.


ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామం రైతులు అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతుల పోరాటం 220వ రోజుకు చేరుకున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి నేతలు సురేష్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామస్థులు, రైతులు సంఘీభావం తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరాలంటే అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి కొనసాగించాలని నినదించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల బిల్లును గవర్నర్​కి పంపటం ప్రభుత్వం చేస్తున్న హేయమైన చర్య అని ప్రకాశం జిల్లా తెదేపా లీగల్ సెల్ అద్యక్షుడు పరిటాల సురేష్ విమర్శించారు.

ఇవీ చూడండి...

'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.