ETV Bharat / state

పొగాకు కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధం - tobacco purchases centers at nellore district news update

పొగాకు కొనుగోళ్ళు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒంగోలు రీజియన్‌లో ఉన్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 66 మిలియన్ల కిలోల పొగాకు పంట కొనుగోళ్ళే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటకలో ఇప్పటికే కొనుగోళ్ళ ప్రక్రియ మొదలవగా.. అక్కడ సీజన్‌ ముగిసే దశలో ఇక్కడ ప్రక్రియ ప్రారంభించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

preparing the sector for tobacco purchases
పొగాకు కొనుగోళ్లకు రంగం సిద్ధం చేస్తున్న అధికారులు
author img

By

Published : Feb 21, 2021, 9:29 PM IST

నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్ళకు పొగాకు బోర్డు రంగం సిద్దం చేస్తోంది. రెండు ప్రాంతాల్లో మార్చి 15 నుంచి ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లాలోని పొదిలి, కందుకూరు 1, 2.. కనిగిరి, నెల్లూరు జిల్లా పిసిపల్లి, కలిగిరి లో ఆరు ప్లాట్‌ ఫారాలు ఏర్పాటు చేసి ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎస్​బీఎస్​లో వెల్లంపల్లి, ఒంగోలు, టంగుటూరు, కొండెపిలో ఉన్న 5 ప్లాట్‌ ఫారాల్లో కొనుగోళ్ళు చేయనున్నారు.

అక్కడ ముగిస్తే.. ఇక్కడ ప్రారంభమవుతాయి..

రెండు ప్రాంతాల్లో కలిపి 66 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోళ్లు చేయనున్నారు. గత ఏడాది 83 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోళ్లకు అనుమతించగా.. ఈ ఏడాది అధిక వర్షాలతో పాటు, మార్కెటింగ్‌ సమస్య కారణంగా లక్ష్యాన్ని తగ్గించారు. మరోవైపు.. కర్ణాటకలో ప్రస్తుతానికి ప్రక్రియ జరుగుతున్న కారణంగా.. బయ్యర్లు అక్కడ నుంచి ఇక్కడకు రావాల్సి ఉంది. దీంతో అక్కడ కొనుగోళ్లు పూర్తయ్యే లోపే ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

గిట్టుబాటు ధర వచ్చే అవకాశం..

గత ఏడాది ఫిబ్రవరిలోనే కొనుగోళ్ళు ప్రారంభించినప్పటికీ, కొవిడ్ కారణంగా నెలరోజులు కూడా పూర్తికాకుండానే కొనుగోళ్ళు నిలిచిపోయాయి. బేళ్ళుగా కట్టిన పొగాకు రంగుమారటం, పాడవ్వడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతేడాది అనుభవాలు కారణంగా రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టారు. దీంతో దిగుబడి తగ్గిపోయింది. తక్కువ దిగుబడి ఉండటం.. మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

వాగ్వాదానికి దారితీసిన.. విద్యార్ధుల ఓటింగ్!

నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్ళకు పొగాకు బోర్డు రంగం సిద్దం చేస్తోంది. రెండు ప్రాంతాల్లో మార్చి 15 నుంచి ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లాలోని పొదిలి, కందుకూరు 1, 2.. కనిగిరి, నెల్లూరు జిల్లా పిసిపల్లి, కలిగిరి లో ఆరు ప్లాట్‌ ఫారాలు ఏర్పాటు చేసి ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎస్​బీఎస్​లో వెల్లంపల్లి, ఒంగోలు, టంగుటూరు, కొండెపిలో ఉన్న 5 ప్లాట్‌ ఫారాల్లో కొనుగోళ్ళు చేయనున్నారు.

అక్కడ ముగిస్తే.. ఇక్కడ ప్రారంభమవుతాయి..

రెండు ప్రాంతాల్లో కలిపి 66 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోళ్లు చేయనున్నారు. గత ఏడాది 83 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోళ్లకు అనుమతించగా.. ఈ ఏడాది అధిక వర్షాలతో పాటు, మార్కెటింగ్‌ సమస్య కారణంగా లక్ష్యాన్ని తగ్గించారు. మరోవైపు.. కర్ణాటకలో ప్రస్తుతానికి ప్రక్రియ జరుగుతున్న కారణంగా.. బయ్యర్లు అక్కడ నుంచి ఇక్కడకు రావాల్సి ఉంది. దీంతో అక్కడ కొనుగోళ్లు పూర్తయ్యే లోపే ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

గిట్టుబాటు ధర వచ్చే అవకాశం..

గత ఏడాది ఫిబ్రవరిలోనే కొనుగోళ్ళు ప్రారంభించినప్పటికీ, కొవిడ్ కారణంగా నెలరోజులు కూడా పూర్తికాకుండానే కొనుగోళ్ళు నిలిచిపోయాయి. బేళ్ళుగా కట్టిన పొగాకు రంగుమారటం, పాడవ్వడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతేడాది అనుభవాలు కారణంగా రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టారు. దీంతో దిగుబడి తగ్గిపోయింది. తక్కువ దిగుబడి ఉండటం.. మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

వాగ్వాదానికి దారితీసిన.. విద్యార్ధుల ఓటింగ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.