ETV Bharat / state

పొగాకు రైతులపై నివర్ తుపాను ఎఫెక్ట్ - నివర్ తుపానుతో ప్రకాశం జిల్లా రైతులకు నష్టం తాజా వార్తలు

పొగాకు పంటపై నివర్ తుపాను ప్రభావం చూపింది. వర్షాల కారణంగా మెుక్కలు కుళ్లిపోయాయి. మరోసారి నారుమళ్లు వేసుకోవాల్సిన పరిస్థితి. నర్సరీల్లో మెుక్కలు లభించక రైతులు ఆవేదన చెందుతున్నారు. నర్సరీలూ వరదకు కొట్టుకుపోవడం ఇందుకు ప్రధాన కారణం.

పొగాకు రైతులపై నివర్ తుపాను ఎఫెక్ట్
పొగాకు రైతులపై నివర్ తుపాను ఎఫెక్ట్
author img

By

Published : Nov 30, 2020, 8:04 PM IST

పొగాకు రైతులనూ.. నివర్ తుపాను ముంచింది. నారుమళ్లు.. వరదకు కొట్టుకుపోయి.. ఇప్పుడెం చేయాలో తెలియని పరిస్థితి. ప్రకాశం జిల్లాలో కొద్ది రోజుల నుంచి పొగాకు నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.. మొక్కలు ఎదుగుతున్న సమయంలో నివర్‌ తుపాన్‌ తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది. వేసిన మొక్కలు నీటిలో కొట్టుకుపోయి, కుళ్ళిపోయాయి. మరోసారి నారుమళ్లు వేసుకోలేని దుస్థితి.

నాగులుప్పలపాడు మండలం మద్దిరాలుపాడు ప్రాంతంలో గుండ్లకమ్మ నదీ ప్రవాహ తీరంలో నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు, అద్దంకి, నాగులప్పలపాడు తదితర మండలాల రైతులు ఇక్కడ నుంచి పొగాకు మెుక్కలు కొనుగోలు చేసి.. తీసుకువెళతారు. అయితే నివర్ తుపాన్​తో కురిసిన వర్షాలకు నదీ ఉద్ధృతంగా ప్రవహించి.. నర్సరీలు వరదనీటిలో కొట్టుకుపోయాయి.

మోటారు ఇంజన్లు, గ్రీన్‌ షెడ్లు, డ్రిప్పులు కూడా వరదలో కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగింది. మూడు, నాలుగు అడుగుల మేర నీరు నిల్వలు పేరుకుపోవడంతో లక్షల రూపాయలు నీటి పాలయ్యాయయని నర్సరీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఇదో ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనో ఫేక్ సీఎం: చంద్రబాబు

పొగాకు రైతులనూ.. నివర్ తుపాను ముంచింది. నారుమళ్లు.. వరదకు కొట్టుకుపోయి.. ఇప్పుడెం చేయాలో తెలియని పరిస్థితి. ప్రకాశం జిల్లాలో కొద్ది రోజుల నుంచి పొగాకు నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.. మొక్కలు ఎదుగుతున్న సమయంలో నివర్‌ తుపాన్‌ తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది. వేసిన మొక్కలు నీటిలో కొట్టుకుపోయి, కుళ్ళిపోయాయి. మరోసారి నారుమళ్లు వేసుకోలేని దుస్థితి.

నాగులుప్పలపాడు మండలం మద్దిరాలుపాడు ప్రాంతంలో గుండ్లకమ్మ నదీ ప్రవాహ తీరంలో నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు, అద్దంకి, నాగులప్పలపాడు తదితర మండలాల రైతులు ఇక్కడ నుంచి పొగాకు మెుక్కలు కొనుగోలు చేసి.. తీసుకువెళతారు. అయితే నివర్ తుపాన్​తో కురిసిన వర్షాలకు నదీ ఉద్ధృతంగా ప్రవహించి.. నర్సరీలు వరదనీటిలో కొట్టుకుపోయాయి.

మోటారు ఇంజన్లు, గ్రీన్‌ షెడ్లు, డ్రిప్పులు కూడా వరదలో కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగింది. మూడు, నాలుగు అడుగుల మేర నీరు నిల్వలు పేరుకుపోవడంతో లక్షల రూపాయలు నీటి పాలయ్యాయయని నర్సరీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఇదో ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనో ఫేక్ సీఎం: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.