మార్కాపురంలో రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి నివర్ తుపాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా రైతాంగం భారీగా నష్టపోయారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన పంటలు వరదల్లో మునిగిపోయాయని ఆవేదన చెందుతున్నారు. మార్కాపురం నియోజక వర్గంలోని రైతులను ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పరామర్శించారు. మండలంలోని తిప్పాయిపాలెం, మిట్టమీదపల్లి గ్రామాల్లో పూర్తిగా నష్టపోయిన మిర్చి, పత్తి, శనగ, మినుము పంటలను వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. మిర్చి కోతలు కోసి కల్లాల్లో ఆరబోసిన కాయలు పాడయ్యాయని రైతులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. కాయలతో ఉన్న చెట్లు నెలకొరిగి చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు తెలిపారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి
నీట మునిగిన పొలాలు.. ప్రాణాలు కోల్పోయిన మూగజీవాలు