ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పర్యటించారు. పట్టణంలోని సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నామని అన్నారు. పట్టణంలోని గడియారస్తంభం కూడలిలో అసంపూర్తిగా ఉన్న దుకాణాల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. గడియరస్తంభం స్థానంలో డిజిటల్ గడియారాన్ని ఏర్పాటు చేసి.. సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
![mla karanam balaram on chirala development](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-ong-41-04-mla-karanam-balaram-paryatana-av-ap10068_04042021120341_0404f_1617518021_512.png)
పూర్వదుకాణాల యజమానులు.. ఎమ్మెల్యేను కలిసి తమ షాపులను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పేరాల కూరగాయల మార్కెట్ను పరిశీలించి వ్యాపారుల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు.
![mla karanam balaram on chirala development](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-ong-41-04-mla-karanam-balaram-paryatana-av-ap10068_04042021120341_0404f_1617518021_74.png)
ఇదీ చదవండి: పవన్ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారు: పేర్ని నాని