త్వరలోనే 11 వేల 500కు పైగా పోలీస్ శాఖ, ఫైర్, జైళ్ల శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రాబోతుందని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించిన హోంమంత్రి ఈ ప్రకటన చేశారు. సుచరితతో పాటు మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత పర్యటనలో పాల్గొన్నారు. యాండ్రపల్లిలోని అంగన్వాడీ నూతన భవనాన్ని, యర్రగొండపాలెం పట్టణంలో అగ్నిమాపక కేంద్ర భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.
త్వరలోనే ఖాళీల భర్తీ: హోంమంత్రి సుచరిత
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత పర్యటించారు. పలు భద్రతా శాఖల్లో ఖాళీలను త్వలోనే భర్తీలు చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు హోంమంత్రి వెల్లడించారు.
![త్వరలోనే ఖాళీల భర్తీ: హోంమంత్రి సుచరిత ministers in yerragundapalem constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9893010-109-9893010-1608083328800.jpg?imwidth=3840)
త్వరలోనే 11 వేల 500కు పైగా పోలీస్ శాఖ, ఫైర్, జైళ్ల శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రాబోతుందని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించిన హోంమంత్రి ఈ ప్రకటన చేశారు. సుచరితతో పాటు మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత పర్యటనలో పాల్గొన్నారు. యాండ్రపల్లిలోని అంగన్వాడీ నూతన భవనాన్ని, యర్రగొండపాలెం పట్టణంలో అగ్నిమాపక కేంద్ర భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పొడిగింపు: మంత్రి సురేశ్