ETV Bharat / state

ఆర్కే మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తాం: ఆర్కే భార్య శిరీష

author img

By

Published : Oct 15, 2021, 12:44 PM IST

Updated : Oct 15, 2021, 1:38 PM IST

rk wife
rk wife

12:41 October 15

మావోయిస్టులకు పోలీసులు వైద్యం అందివ్వడం లేదు: ఆర్కే భార్య శిరీష

ఆర్కే మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తాం: ఆర్కే భార్య శిరీష

ఆర్కే మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తామని  ఆర్కే భార్య శిరీష చెప్పారు. మావోయిస్టులకు పోలీసులు వైద్యం అందనివ్వడం లేదని ఆరోపించారు. మావోయిస్టులకు వెళ్లే ఆహారంలో విషం కలుపుతున్నారని, ఆర్కే విషయంలో విష ప్రయోగం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్టు నేత ఆర్కే ప్రజల కోసం తన జీవితాన్నే ధారపోశారని చెప్పారు. ఆర్కే మృతిపై పార్టీ ప్రకటన తర్వాత  బోరున విలపించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలుకూరుపాడులో ఉంటున్న శిరీష.. ఆర్కే మృతదేహాన్ని చూసే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలని కోరారు. భర్తను కోల్పోయిన శిరీషను పలువురు విరసం నేతలు పరామర్శించారు.

ఆర్కే విప్లవకారుడిగా జీవించాడు.. విప్లవకారుడిగానే మరణించాడు:  విరసం నేత కల్యాణరావు 

ఆర్కే విప్లవకారుడిగా జీవించారు.. విప్లవకారుడిగానే మరణించారని విరసం నేత కల్యాణరావు అన్నారు.  ఆర్కే ప్రజల హృదయాల్లో ఉంటారన్న ఆయన.. ఆర్కే ఆశయ సాధనను కొనసాగిస్తామని చెప్పారు. పోలీసులు.. ఆర్కేకు వైద్యం అందకుండా చేశారని చెప్పారు. ప్రజల కోసమే ఆర్కే అమరుడయ్యారన్నారు. 

మావోయిస్టుల అణచివేతకు కేంద్రం లక్షల కోట్లు వెచ్చిస్తోంది: పినాకపాణి

ఆపరేషన్ సమాధాన్ పేరుతో మావోయిస్టులను అణచి వేస్తున్నారని విరసం నేత పినాకపాణి ఆరోపించారు. మావోయిస్టులను వైద్యం అందకుండా ఆపరేషన్​ సమాధాన్​ చేపట్టారని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: కరెంటు కొనుగోలు.. రెండు నెలల్లోనే అన్ని కోట్ల ఖర్చా?

12:41 October 15

మావోయిస్టులకు పోలీసులు వైద్యం అందివ్వడం లేదు: ఆర్కే భార్య శిరీష

ఆర్కే మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తాం: ఆర్కే భార్య శిరీష

ఆర్కే మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తామని  ఆర్కే భార్య శిరీష చెప్పారు. మావోయిస్టులకు పోలీసులు వైద్యం అందనివ్వడం లేదని ఆరోపించారు. మావోయిస్టులకు వెళ్లే ఆహారంలో విషం కలుపుతున్నారని, ఆర్కే విషయంలో విష ప్రయోగం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్టు నేత ఆర్కే ప్రజల కోసం తన జీవితాన్నే ధారపోశారని చెప్పారు. ఆర్కే మృతిపై పార్టీ ప్రకటన తర్వాత  బోరున విలపించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలుకూరుపాడులో ఉంటున్న శిరీష.. ఆర్కే మృతదేహాన్ని చూసే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలని కోరారు. భర్తను కోల్పోయిన శిరీషను పలువురు విరసం నేతలు పరామర్శించారు.

ఆర్కే విప్లవకారుడిగా జీవించాడు.. విప్లవకారుడిగానే మరణించాడు:  విరసం నేత కల్యాణరావు 

ఆర్కే విప్లవకారుడిగా జీవించారు.. విప్లవకారుడిగానే మరణించారని విరసం నేత కల్యాణరావు అన్నారు.  ఆర్కే ప్రజల హృదయాల్లో ఉంటారన్న ఆయన.. ఆర్కే ఆశయ సాధనను కొనసాగిస్తామని చెప్పారు. పోలీసులు.. ఆర్కేకు వైద్యం అందకుండా చేశారని చెప్పారు. ప్రజల కోసమే ఆర్కే అమరుడయ్యారన్నారు. 

మావోయిస్టుల అణచివేతకు కేంద్రం లక్షల కోట్లు వెచ్చిస్తోంది: పినాకపాణి

ఆపరేషన్ సమాధాన్ పేరుతో మావోయిస్టులను అణచి వేస్తున్నారని విరసం నేత పినాకపాణి ఆరోపించారు. మావోయిస్టులను వైద్యం అందకుండా ఆపరేషన్​ సమాధాన్​ చేపట్టారని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: కరెంటు కొనుగోలు.. రెండు నెలల్లోనే అన్ని కోట్ల ఖర్చా?

Last Updated : Oct 15, 2021, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.