ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో ఇంటర్ డిస్ట్రిక్ బాల బాలికల ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీవీఆర్ బాలుర పాఠశాలలో జరుగుతున్న ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో మొదటిరోజు బాల బాలికల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. పోటీలను చూసేందుకు నగరవాసులు ఉత్సాహం చూపారు. గుంటూరు, ప్రకాశం-బాలురు, ప్రకాశం, వైజాగ్-బాలికల మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్లో ఇరు జట్ల పోటీ ఉత్కంఠగా సాగింది.
ఇవీ చదవండి...'కమిన్స్ను దేశానికి ప్రధాని చేయండి'