ETV Bharat / state

కనిగిరి రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసులో 13మంది అరెస్ట్​ - Kanigiri real estate dealer kidnape news

ప్రకాశం జిల్లా కనిగిరిలో గత నెల 9న జరిగిన రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసుకు సంభందించిన నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారినుంచి మూడు ఇన్నోవా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కందుకూరు డీఎస్పీ వెల్లడించారు.

కనిగిరి రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసులో 13మంది అరెస్ట్​
కనిగిరి రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసులో 13మంది అరెస్ట్​
author img

By

Published : Mar 2, 2020, 7:51 AM IST

కనిగిరి రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసులో 13మంది అరెస్ట్​

ప్రకాశం జిల్లా కనిగిరిలో గత నెల 9న జరిగిన రియల్​ ఎస్టేట్​ వ్యాపారి లతీఫ్​ కిడ్నాప్​ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.​ అయితే ఈ కేసుకు సంభందించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేసినట్లు కందుకూరు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 3 ఇన్నోవా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కనిగిరికి చెందిన రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ఖాదర్​కి బాధితుడు లతీఫ్​కి గతంలో పాత గొడవలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఖాదర్ పెద్ద కుమారుడు మరికొంత మంది అనుచరులతో కలసి లతీఫ్​ని కిడ్నాప్ చేసి ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు ఖాదర్ కుమారుడితో పాటు గుంటూరుకు చెందిన జబ్బార్​ను మరొక 11 మందిని కోర్టకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన కనిగిరి ఎస్​ఐని ప్రత్యేకంగా అభినందించారు.

ఇదీ చూడండి: కనిగిరిలో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసు సుఖాంతం

కనిగిరి రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసులో 13మంది అరెస్ట్​

ప్రకాశం జిల్లా కనిగిరిలో గత నెల 9న జరిగిన రియల్​ ఎస్టేట్​ వ్యాపారి లతీఫ్​ కిడ్నాప్​ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.​ అయితే ఈ కేసుకు సంభందించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేసినట్లు కందుకూరు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 3 ఇన్నోవా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కనిగిరికి చెందిన రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ఖాదర్​కి బాధితుడు లతీఫ్​కి గతంలో పాత గొడవలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఖాదర్ పెద్ద కుమారుడు మరికొంత మంది అనుచరులతో కలసి లతీఫ్​ని కిడ్నాప్ చేసి ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు ఖాదర్ కుమారుడితో పాటు గుంటూరుకు చెందిన జబ్బార్​ను మరొక 11 మందిని కోర్టకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన కనిగిరి ఎస్​ఐని ప్రత్యేకంగా అభినందించారు.

ఇదీ చూడండి: కనిగిరిలో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసు సుఖాంతం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.